పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి , వైఎస్ జగన్ పార్టీకి చాలా మేలు చేస్తున్నాడని రాజకీయ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన హవా ఏమిటో చూపిస్తున్నారు. తన మంత్రి వర్గంలో ఉన్న తన శత్రువు వర్గాన్ని ఒక్కొక్కరిగా తప్పిస్తున్నారు. గతంలో దళిత నాయకుడైన మంత్రి శంకరరావుకు , మంత్రి పదవి నుండి తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఢీఎల్ రవీంద్రారెడ్డికు సీఎం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మద్య తారా స్థాయిలో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపిన సీఎం ఢిఎల్ పై వేటు వేయటం జరిగింది. ఢిఎల్ ఫై వేటు వేయటంతో కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి వర్గం రెండు వర్గాలు చీలిపోయినట్లు సమాచారం. కొంతమంది ముఖ్యమంత్రి సపోర్టుగా నిలబడ్డారు. మరికొందరు ఢిఎల్ వేటు ను తీవ్రంగా ఖండించారు. సీనియర్ నాయకులు మంత్రి జానారెడ్డి, పాల్వాయి గోవర్థన్ రెడ్డి, అలాంటి ముఖ్యమంత్రి పై విమర్శలు చేసినట్లు సమాచారం. ఢిఎల్ పై వేటు కారణంగా .. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు సమావేశం అయ్యి, భవిష్యతు కార్యచరణ పై చర్చలు గాంధీ భవన్ లో జరిగినట్లు కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. మరికొంతమంది సీనియర్ నాయకులు ఢిల్లీకి వెళ్లి.. అధిష్టానం దగ్గర తమగోడు వినిపించటానికి వెళ్లినట్లు సమాచారం.
అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడతో విసిపోయిన రెడ్డి వర్గం నాయకులు కాంగ్రెస్ పార్టీ ని వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వస్తే ఏ పార్టీలోకి వెళ్లే విషయం పై తీవ్రంగా చర్చలు జరుగుతున్నారు. ఎక్కువ మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది వైసీపీ ముఖ్య నాయకులతో రహస్య మంతనాలు జరిపినట్లు కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ ల్లో గుసగుసలాడుకుంటున్నారు. ఇదే విధంగా కొనసాగితే.. 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ లో రెడ్లు శాతం పూర్తిగా పడిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కి దళితులు దూరంగా ఉన్నారు. ఒక దళిత వర్గం వైసీపీకి మద్దతుగా ఉంటే, మరో దళిత వర్గం టిడిపి మద్దతూగా బాబు పాదయాత్రకు రక్షణ గా నిలిచింది. ఇక రాష్ట్రం లో మిగిలింది.. బీసీలు, కాపులు. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు పోటీగా నిలబడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి 2014లో ఓటమి చవిచూసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని సీనియర్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీఎం దూకుడు తగ్గించి, అన్ని వర్గాల వారిని కలుపుకోని పోతే కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు దక్కుతాయాని రాజకీయ మేథావులు అంచనా. కాంగ్రెస్ అధిష్టానం 2014లో ఏం మ్యాజిక్ చేస్తుందో చూద్దాం..?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more