Nimmagadda prasad

nimmagadda prasad, cbi,

nimmagadda prasad

prasad.gif

Posted: 07/14/2012 03:26 PM IST
Nimmagadda prasad

జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అతిగా వ్యవహరిస్తోందని, లేదా నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు చాలాకాలంగా వినిపిస్తువే. అయితే వాటిలో నిజం ఉందన్న భావన కలిగేలా వాన్ పిక్‌ కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ విషయంలో సిబిఐ వ్యవహరిస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది.పైగా సిబిఐ కూడా ఇలా అసత్యాలు చెప్పవచ్చా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. ఉదాహరణకు నిమ్మగడ్డ ప్రసాద్ ను సిబిఐ పదమూడు సార్లు విచారణకు పిలిచిందట. కాని సిబిఐ కోర్టులో తన వాదనలో కేవలం ఎనిమిదిసార్లే పిలిచానని చెబుతోందట. దీనిపై ప్రసాద్ న్యాయవాది, తమ వద్ద మొత్తం ఆధారాలు ఉన్నాయని,సిబిఐ కేసు డైరీని నిర్వహించడం లేదని కోర్టుకు నివేదించారు.పైగా ప్రసాద్ ను అరెస్టు చేసిన తర్వాత ఆయన సిబ్బంది సమాచారం ఇస్తున్నారని సిబిఐ వాదించింది.

nimmagadda prasad

దానికి సమాదానంగా తాను అనుమతించకపోతే ఎవరైనా తన సిబ్బంది సమాచారం ఇస్తారా అని ప్రసాద్ ప్రశ్నించారు.పది రోజులపాటు సిబిఐ కస్టడీలోకి తీసుకుని కేవలం పదిహేను గంటలు కూడా విచారించలేదని, ఖాళీగా కూర్చోబెట్టారని ఆయన చెప్పారు. సిబిఐ అదికార దుర్వినియోగానికి ఇది నిదర్శమని ఆయన వ్యాఖ్యానించారు.వాన్ పిక్ కింద కొనుగోలు చేసిన భూములకు మార్కెట్ రేటు చెల్లించామని, వెనుకబడిన ప్రాంతంలో పరిశ్రామికాభివృద్ది సాధించాలని తాము ఈ ప్రాజెక్టును చేపడితే ఇలా జైలులో పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గంగవరం పోర్టు మాదిరే అన్ని ఒప్పందాలు ఉండవలసిన అవసరం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.నిమ్మగడ్డ ఈ వ్యవహారంలో మన దేశం తరపున భాగస్వామి తప్ప, ఆయనే ఒప్పందం చేసుకోలేదని, రెండు ప్రబుత్వాల మద్య ఒప్పందమని , ఒప్పందాలను చేసుకున్నవారిని వదలిపెట్టి తనను అరెస్టు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు.భారీగా పెట్టుబడి పెట్టిన వ్యక్తిని జైలులో పెట్టడమేమిటని కూడా ఆయన అడిగారు.కావాలంటే వాన్ పిక్ కోసం సేకరించిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని కూడా ఆయన స్పష్టం చేశారు.జగన్ కంపెనీలలో తాను లాభాల కోసమే పెట్టుబడులు పెట్టానని, మిగిలిన పెట్టుబడుదారులంతా బయట ఉండగా, తనను జైలులో ఉంచడమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రసాద్ తరపు న్యాయవాది చేసిన వాదన అంత నిజమే అయితే, సిబిఐ ప్రభుత్వ సంస్థ అయి ఉండి, ఇన్ని అబద్దాలు కోర్టుకు చెప్పి ఉంటే , ఇది దారుణమైన విషయమే.ఇక్కడ కోర్టు బెయిల్ ఇస్తుందా? లేదా అన్నదానిని పక్కనబెడితే, సిబిఐ మాత్రం హేతుబద్దంగా వ్యవహరించడం లేదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినవారిపట్ల అనుచితంగా వ్యవహరిస్తోందన్న అబిప్రాయం కలుగుతోంది. ఇది రాష్ట్రానికి,దేశానికి ఏ మాత్రం మంచిదికాదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna meets naidu
Who is the ys jagan agent  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more