ఓదార్పు యాత్రలో జగన్ అలుపు లేకుండా ఓదార్చిన విషయం తెలిసిందే. ఒక పక్క ఓదార్పు యాత్ర చేస్తునే మరొపక్క హైకమాండ్ దగ్గర ఏం జరుగుతోందో కూడా జగన్ తెలుసుకోవటం విశేషం. అధిష్టానం దగ్గరే జగన్ ఏజంట్ ఉన్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.నేను రేపో మాపో అరెస్టు కాబోతున్నాను. కాంగ్రెస్ పార్టీ సీబీఐని ఉసిగొల్పి నన్ను అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టేందుకు రంగం సిద్దం చేసింది. నా అరెస్టు ఖాయం’’ సీబీఐ అరెస్టుకు కొన్ని రోజుల ముందు గుంటూరు జిల్లా పర్యటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆ తరువాత రెండు రోజులకే సీబీఐ నోటీసులు, కోర్టుకు హాజరు కావాల్సి రావడం, ఆ తరువాత సీబీఐ ముందే రావాలంటూ తాఖీదులివ్వడం, విచారణకు హాజరవుతుండగానే జగన్ ను అరెస్టు చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి.
జగన్ అక్రమంగా అరెస్టు చేశారని విజయమ్మ కంటతడి పెట్టింది. జగన్ మాత్రం నిబ్బరంగా చంచల్ గూడ నుండి సీబీఐ కోర్టుకు, సీబీఐ విచారణకు చేతులూపుకుంటూ హాజరవుతున్నారు. జగన్ అరెస్టు విషయం జగన్ కు ముందే ఎలా తెలిసింది ? 9 నెలలుగా సీబీఐ విచారణ సాగుతుండగా జగన్ అరెస్టుకు నాలుగు రోజుల ముందే తాను అరెస్టు కాబోతున్నానంటూ ఎలా చెప్పాడు ? అదంతా తావీద్ మహిమేం కాదు. కాంగ్రెస్ కోర్ కమిటీలోనే జగన్ కు ఏజంట్లు ఉన్నారు. వారెవరనే విషయం చెబితే మీరు ఆశ్చర్యపోతారేమో !కాంగ్రెస్ కోర్ కమిటీ విషయాలన్నీ కాంగ్రెస్ కురు వృద్ధుడు, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ నుండే ఈ విషయాలన్నీ జగన్ కు ముందే తెలుస్తున్నాయట. అవును కాంగ్రెస్ సీనియర్ నేత అయిన ప్రణబ్ ముఖర్జీకి, దివంగత ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికీ లేనంత స్వేచ్చ వైఎస్ కు లభించడం వెనక ఈ బెంగాల్ దాదా ప్రోత్సాహమే కారణమట. కాంగ్రెస్ అధిష్టానం నుండి వైఎస్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, రాష్ట్రంలో ఆయన ఎలా చెబితే అలా జరిగేలా ప్రణబ్ అధిష్టానం నుండి స్వేచ్చ ఇప్పించారని సమాచారం.
వైఎస్ మరణం తరువాత ఆ కుటుంబంతో ప్రణబ్ సంబంధాలు అంతే సన్నిహితంగా ఉన్నాయని, కాంగ్రెస్ లో జరిగే ప్రతి విషయం జగన్ కు అప్పటి నుండే తెలుస్తుందని సమాచారం. జగన్ అరెస్టుకు కొద్దిరోజుల ముందే కోర్ కమిటీలో జరిగిన నిర్ణయాన్ని ప్రణబ్ జగన్ తేల్చి చెప్పారట. అరెస్టు చేయడం ఖాయం అని చెప్పడంతో జగన్ అంతకుముందే దానికి సిద్దమయ్యాడని తెలుస్తోంది.ప్రణబ్ ముఖర్జీ ఇప్పుడ రాష్ట్రపతి పదవికి పోటీలో ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 148 ఓట్లు చొప్పున వస్తాయి కాబట్టి ఈ లెక్కన ఇద్దరు ఎంపీలు, పదిహేడుమంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్ పెద్ద ఓటు బ్యాంకే. అందుకే ఆయన మద్దతు కోసం కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేసిందని ప్రచారం జరిగింది. ప్రయత్నాలు జరిగినా, జరగకున్నా… జగన్ మద్దతు ప్రణబ్ కే. ఇది వంద శాతం గ్యారంటీ. దీనికి జగన్ చెప్పబోయే కారణం ఏంటంటే….పోటీలో ఉన్నది ఇద్దరే. వారిలో ఒకరు మతతత్వ శక్తులు అండగా నిలిచిన వ్యక్తి కాబట్టి లౌకిక న్యాయం పాటించి ప్రణబ్ కు ఓటేశాం. మాకు ప్రజల విశాల ప్రయోజనాలే ముఖ్యం అని రాజకీయ కబుర్లు చెబుతారు. వెయిట్ అండ్ సీ!
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more