కర్ణాటక యెడ్డి .. గుజరాత్ మోడి .. మెండివారని మరోసారి రుజువు అయింది. యోడ్డి పదవి కోసం ప్రయత్నిస్తుంటే.. మోడి మాత్రం తనకు వ్యతిరేకులైన వారిని తొక్కే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు కమలంలోని వారే కావటం గర్వకరణం. కమలంలో కలహం ముదిరింది. అగ్రనేతలు నరేంద్రమోడీ, అద్వానీ భేటీ తరువాత సద్దుమణిగినట్టు కనిపించిన పరిస్థితి.. 'పోస్టర్' వివాదంతో మళ్లీ మొదటికొచ్చింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సంజయ్ జోషి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని బీజేపీ ద్రువీకరించింది. ఆయన రాజీనామాను అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఆమోదించినట్టు కూడా ప్రకటించింది. ముంబై కార్యవర్గ సమావేశాలకు ఒక రోజు ముందు మోడీ ఒత్తిడితో ఈసీ సభ్యత్వానికి రాజీనామా చేసిన జోషి.. గుజరాత్ అసెంబ్లీకి మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాజ్కోట్లో జరగనున్న కార్యవర్గ సమావేశాలకు సరిగ్గా ఒక రోజు ముందు, పార్టీ పదవికి, సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించడం విశేషం.
ఈ పరిణామం పార్టీపై మోడీ పట్టును, ప్రత్యర్థుల పట్ల ఆయన దృఢ వైఖరిని చాటిచెప్పినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముంబై కార్యవర్గ భేటీని తొలుత బాయ్కాట్ చేసిన మోడీ..జోషి పక్కకు తప్పుకున్న వెంటనే హడావుడిగా ముంబైకి బయలుదేరిన విషయాన్ని ఈ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో గుజరాత్లో తనకు వ్యతిరేకంగా ప్రత్యక్షమవుతున్న పోస్టర్లపై నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ మేరకు చర్యల కోసం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచారు. ఫలితంగానే జోషి పార్టీని వదిలిపెట్టాల్సి వచ్చిందనేది ఈ వర్గాల విశ్లేషణ. ఈ క్రమంలో పార్టీ, ఆర్ఎస్ఎస్ శ్రేణులు..మోడీ, జోషి వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి కనిపించింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికార పత్రికలు కమల్ సందేశ్, పాంచజన్య జోషిని వెనకేసుకురాగా, ఆర్ఎస్ఎస్కే చెందిన మరో అధికార పత్రిక ఆర్గనైజర్ మోడీకి మద్దతు తెలుపుతూ సంపాదకీయాలు రాసింది. ఈ రాతల యుద్ధం కొనసాగుతుండగానే గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో పోస్టర్ వెలిసింది. " సంకుచిత మనస్కులు పెద్ద మనుషులు కాలేరు'' అనేది ఆ పోస్టర్ సారాంశం. దానిపై కర్త, కర్మ ఎవరూ లేకపోయినా మోడీనే లక్ష్యంగా చేసుకున్నారనేది తేటతెల్లమే. దీనిపై అగ్రనాయకత్వస్థాయిలో రేగిన కలకలం సర్దుకోకముందే మరో పోస్టర్ వెలిసింది. "రాజధర్మం, ప్రజాధర్మం, పార్టీ ధర్మం పాటించు'' అంటూ హితవు పలికింది.
ఎన్డీయే హయాంలో అప్పటి ప్రధాని వాజ్పేయి "రాజ ధర్మం పాటించాలి'' అని మోడీకి సూచించిన దరిమిలా.. ఆ పోస్టర్ దాడి ఎవరి మీదనో తెలుస్తూనే ఉంది. వీటన్నింటి నేపథ్యంలోనే "నన్ను తప్పించండి'' అని జోషి అధ్యక్షుడు గడ్కరీకి లేఖ రాయడం, ఆ వెంటనే ఆయన ఆమోదించడం జరిగిపోయాయి. నిజానికి, జోషి.. గడ్కరీకి అత్యంత సన్నిహితుడు. రాసలీలల సీడీల వివాదంలో చిక్కుకొని ఒకసారి జోషి పార్టీని వదిలిపెట్టిపోగా, గడ్కరీ ఆయనకు పునః ప్రవేశం కల్పించారు. జాతీయ కార్యవర్గంలో స్థానం ఇచ్చారు. ప్రతిష్ఠాత్మకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జీగానూ నియమించారు. అప్పటి నుంచి జోషి ప్రాబల్యాన్ని పార్టీలో తగ్గించేందుకు అధిష్ఠానంపై మోడీ క్రమంగా ఒత్తిడి తెస్తున్నారు. ఈ సమయంలోనే గడ్కరీ పదవీకాలం ముగింపునకు వచ్చి..రెండోసారి అవకాశం కోసం చురుగ్గా పావులు కదిపారు. మోడీ మద్దతు లేకుండా అది సాధ్యం కాదని గ్రహించారు. అప్పటి నుంచి మోడీకి నచ్చే పనులు చేయడం ప్రారంభించారు. ముంబై కార్యవర్గానికి ఒక రోజు ముందు జోషి ఈసీకి రాజీనామా చేయడం, "మోడీతో కలిసి పార్టీని బలోపేతం చేస్తా''నని గడ్కరీ ప్రకటించడం, ఇప్పుడు జోషి పార్టీని వదిలేయడం ఇత్యాది పరిణామాలన్నీ అందులో భాగమేననేది పార్టీ వర్గాల విశ్లేషణ. కాగా, బీజేపీ నుంచి బయటకువచ్చిన జోషికి ఆ వెంటనే ఆర్ఎస్ఎస్ నుంచి ఆహ్వానం అందింది. సంస్థ అనుబంధ విభాగం ఇతిహాస్ పరిషత్ జాతీయ కార్యదర్శి బాధ్యతలను అప్పగించడం ద్వారా తమ పూర్వ ప్రచారక్కు ఆ సంస్థ పునః ప్రవేశం కల్పించింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more