వైఎస్ జగన్ టార్గెట్ 20 లక్షల కోట్లు అని ఆంధ్రవిశేష్ గతంలోనే చెప్పటం జరిగింది. ముందుగానే జగన్ రాబోయే రోజుల్లో జగన్ 20 లక్షల కోట్లు సంపాదించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్, ఆయన బంధువులు, బినామీల ఆధీనంలో రాష్ట్రంలో 2.75 లక్షల ఎకరాల భూములు, గనులు ఉన్నాయి కానీ ఇవి ఆక్రమించుకొన్నవి కావట. ప్రభుత్వం ద్వారా అధికారికంగా కేటాయింపజేసుకోన్నవట.ఈ భూమల్లో ఇనుప ఖనిజం, బెరైటీస్, సున్నపురాయి తదితర ఖనిజ నిల్వలున్న గనుల విస్తీర్ణం 1.80 లక్షల ఎకరాలు. వివిధ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం నుంచి తీసుకొన్న ఇతర భూములు 95 వేల ఎకరాలు అని తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరభద్రరావు అంటున్నారు.
తన ఆరోపణకు మద్దతుగా ఈ భూములు పొందిన వ్యక్తులు, సంస్థల జాబితాను, రాష్ట్రంలో ఏ జిల్లాలో వీటిని పొందారో వివరించే చిత్రపటాన్ని కూడా ఆయన విడుదల చేస్తున్నట్లు చెబుతున్నారు. తమ ఆధీనంలో ఉన్న గనుల ద్వారా జగన్ బృందం రాబోయే 15 ఏళ్లలో రూ.16 లక్షల కోట్ల ఆదాయం గడించే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. అంతేకాకుండా మేం అడ్డగోలుగా ఈ ఆరోపణ చేయడం లేదు, ఖమ్మం జిల్లా బయ్యారం ప్రాంతంలో వైఎస్ తన అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్కు చెందిన రక్షణ స్టీల్స్కు 1.40 లక్షల ఎకరాల (56 వేల హెక్టార్లు) ఇనుప ఖనిజం గనులు కేటాయించారు. వీటిలో 1100 కోట్ల టన్నుల ఖనిజం ఉన్నట్లు అంచనా. టన్ను ఖనిజం ధర రూ.3500 వేసుకొంటే రాబోయే ఇరవై, పాతికేళ్లలో రూ.40 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మేం కేవలం 15 ఏళ్లలో రూ.14 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని మాత్రమే లెక్కగట్టాం. మా లెక్కలకు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకొన్నామాని ఆయన అంటున్నారు. అదే జిల్లాలో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి చేతిలో 600 ఎకరాల బెరైటీస్ గనులు ఉన్నాయని, 15 ఏళ్లలో లక్ష కోట్ల ఆదాయం వస్తుందని లెక్క వేశామని చెబుతున్నారు.
"జగన్కు ఎన్ని లక్షల కోట్ల ఆదాయం వచ్చినా మాకు బాధేం లేదు. కానీ, రాష్ట్రానికి రావాల్సిన ఇంత భారీ ఆదాయం ఒక కుటుంబపరం కావడంపైనే మా ఆందోళన. 15 ఏళ్లలో రూ.16 లక్షల కోట్ల ఆదాయం ఒక కుటుంబానికి వెళ్తే ఈ రాష్ట్రం ఏం కావాలి? అదే ఆదాయం ప్రభుత్వానికి వస్తే ప్రజలపై ఒక్క రూపాయి కూడా పన్ను వేయకుండా ప్రభుత్వాన్ని నడపవచ్చు. పేదల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టవచ్చు. తమ కుటుంబ సభ్యులు, ఆప్తులు, మిత్రుల పేర్లతో ఈ భూములు, గనులు కేటాయించినా అవన్నీ వైఎస్ కుటుంబానికి చెందినవే. విశాఖ మన్యంలో బాక్సైట్ గనుల కేటాయింపును వైఎస్ స్వయంగా నడిపించారు. అవి మావని చెప్పి ఆయన అందరి నోరు మూయించారు. ఆయన మహానుభావుడు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అందినకాడికి దోచుకోండన్న మహా సందేశం ఇచ్చి వెళ్లిపోయారు. సేవ అవసరం లేదని, సొమ్ములుంటే అందరూ చేరతారన్న జీవిత సత్యం బోధించి వెళ్లారు. ఆయన ఆరేళ్ల పాలనలో బాగా బాగుపడింది ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు తప్ప ప్రజలు కాదు. తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని జగన్ చెలరేగిపోయారు. ఇది అవినీతి కాదు. దోపిడీ. ఈ దోపిడీని చూసి ఘోరీలు, గజనీలు కూడా తలవంచుకోవాలి వీరభద్రరావు మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more