జగన్ డబ్బు సంపాదించుకోలేదని జగన్ అనడంలేదని ఆయన గుర్తు చేశారు. ఎస్... సంపాదించాను. కానీ... అది అక్రమం కాదు. మా తండ్రి ఆదేశాల ద్వారా మేలు పొందిన వారు, నా కంపెనీల్లో పెట్టుబడులు పెడితే, అందులో నా తప్పేముంది? అని జగన్ వాదిస్తున్నారన్నారు. ఇలాంటి వాదనలు చేయడం బహుశా దేశంలోనే ఇది మొదటిసారి అని ఉండవల్లి అన్నారు. 'మా నాన్న చేసిన మంచి మొత్తం నాది. చెడు మాత్రం మీది.
కష్టసుఖాలు పంచుకోవడమంటే... కష్టం మీకు, సుఖం నాకు అనేలా జగన్ వైఖరి ఉందన్నారు. వైఎస్ ఉండి ఉంటే... మోపిదేవి వెంకటరమణను బయటికి రప్పించి, తాను జైలుకు వెళ్లే వారని, అన్నింటికీ తనదే బాధ్యత అని చెప్పేవారని ఉండవల్లి పేర్కొన్నారు. అందుకే... ఆయనను సోనియాతో సహా అందరూ నమ్మారని తెలిపారు. వైఎస్కు సోనియా సర్వాధికారాలు ఇచ్చినందునే ఆయనకు ఇంత పేరు లభించిందని అభిప్రాయపడ్డారు. తనను ముఖ్యమంత్రిని చేసేందుకు సోనియా రాజకీయాల్లోకి వచ్చినట్లుందని వైఎస్ స్వయంగా నాతో అన్నారు. అప్పటిదాకా రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడో ఉన్న వైఎస్ను సోనియానే పైకి తీసుకొచ్చారు. అలాంటిది సోనియాను వైఎస్ కుటుంబ సభ్యులు విమర్శించడం దారుణం అని ఉండవల్లి పేర్కొన్నారు. సోనియాకు వారు విధేయంగా ఉండక్కర్లేదుకానీ... వారికి మాత్రం తామంతా విధేయులుగా ఉండాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ కారణంగా కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిందన్న అభిప్రాయంపై స్పందిస్తూ "నిజానికి కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడలేదు. వైఎస్ ఆత్మే కాంగ్రెస్ను నిలబెడుతుంది'' అని అన్నారు. వైఎస్ మరణంపై ఆయన కుటుంబ సభ్యుల వైఖరి తప్పు అని, అది నిలబడదని స్పష్టం చేశారు. వైఎస్ది ప్రమాదవశాత్తూ జరిగిన మరణమే అని పునరుద్ఘాటించారు. "హెలికాప్టర్ కాక్పిట్ వాయిస్ రికార్డులు అన్ని చానళ్ల వద్ద ఉన్నాయి. అమెరికా నిపుణులు సైతం డీకోడ్ చేసి వెనక్కి పంపించారు.
ఇంటర్నెట్లోనూ వివరాలు పెట్టారు. ఇందులో దాపరికం ఏమీ లేదు. సీబీఐ రిపోర్టులోని 400 పేజీలను చదివాను కాబట్టే... దానిపై సాధికారికంగా మాట్లాడగలుగుతున్నాను అని తెలిపారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ మృతిని మళ్లీ తెరపైకి తెచ్చారు తప్ప... మరో ఉద్దేశం కనిపించడంలేదని ఉండవల్లి అన్నారు. ఉప ఎన్నికల్లో జగన్ పార్టీకి పడే ప్రతి ఓటూ వైఎస్ను చూసే పడుతుందని అభిప్రాయపడ్డారు. "నా భర్తను చంపారు, నా కొడుకును అరెస్టు చేశారని విజయలక్ష్మి అంటున్నారు. అంటే సీబీఐ వాళ్లు చంపారా? కాంగ్రెస్ వాళ్లు తప్పుడు కేసులు పెట్టారంటారా? కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా అందరూ కలిసిపోయారా!? మన దేశంలో ఇది సాధ్యం కాదు'' అని స్పష్టం చేశారు. ప్రమాదం గురించి ముందే తెలిసే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్తో చిత్తూరు వెళ్లలేదా! అని షర్మిల వ్యక్త చేసిన తాజా అనుమానంపై స్పందిస్తూ... 'రచ్చబండ ప్రణాళిక రచనలో నేను మొదటి నుంచి పాల్గొన్నాను. నేనూ చిత్తూరు వెళ్లలేదు. ఎప్పుడూ వైఎస్ను వెన్నంటి ఉండే సూరీడు కూడా ఆ రోజు హెలికాప్టర్లో వెళ్లలేదు. అంటే... మేమంతా కుట్రలో పాల్గొన్నామనా?'' అని ఉండవల్లి ప్రశ్నించారు. రాజీవ్గాంధీ ఎప్పుడూ తన తల్లి ఇందిరాగాంధీ హత్య గురించి సభల్లో ప్రస్తావించలేదని గుర్తు చేశారు. తండ్రి వల్ల జగన్ లబ్ధి పొందారనడంలో ఎలాంటి అనుమానం లేదని ఉండవల్లి అంగీకరించారు. కుమారుడి ఆస్తుల గురించి వైఎస్కు తెలియదా అని అడగ్గా... తెలియక పోవచ్చునని ఉండవల్లి బదులిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more