Andhra pradesh

andhra pradesh, Politics, Assembly, Parliament, Politics, Political Leaders, Officers, Government Officers,

andhra pradesh

andhra pradesh010.gif

Posted: 06/02/2012 05:17 PM IST
Andhra pradesh

andhra-pradesh

భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్.  .ఇప్పుడు అవినీతి  రాజకీయ కోటేశ్వర్లతో నిండిపోయి ఉందని దేశ మేధావుల సంఘం అంటుంది. ఆంద్రప్రదేశ్ లో అడ్డగొలుగా పెరిగిన అవినీతి రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారట.  ఇలాంటి నాయకులు  ఎన్నికల ద్వారా రాజకీయ ప్రవేశం చేసి లక్ష కోట్లు దండుకుంటున్నారు.  పూర్వం ఎన్నికల కమిషన్  ప్రక్రియా నడిచే విధానంలో మార్పు ఉండేది కాదు. కానీ ఇప్పుడు  ఎన్నికల కమిషన్ కు   ఉన్న అధికారం బలం, ఆధునిక పరిజ్నానం  వలన  కొంతమేరకు ప్రజలకు మేలు చేకురుతుందని ఎన్నికల కమిషన్   చెబుతున్నట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి.   ప్రజా స్వామ్యంలో వచ్చే ఈ కొత్త రాజకీయ నాయకులు వలన వ్యవస్థ  చాలా దెబ్బతింటుందని  మీడియా శ్రేణులు అంటున్నాయి.  ఉదాహరణకు .. కనకంపై కూర్చున్న గాలి,  లక్ష కోట్లు సంపాదించుకున్న జగన్ ,  కేవలం పది కోట్లకు ఆశపడి .. న్యాయ వ్యవస్థకు కళంకం తెచ్చిన జడ్జి  పట్టాబి రామ్.., పేద ప్రజల భూములను అక్రమంగా 15 వేల ఎకరాలు  వాన్ పిక్ అంటగట్టిని మంత్రి మోపిదేవి వెంకటరమణ, అక్రమ బెయిల్  కోసం దందా నడిపి మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఇంక చెప్పకుంటు పోతే  చాలా మంది రాజకీయ కొత్త కోటేశ్వర్లు ఉన్నారని .. మీడియా శ్రేణులు అంటున్నాయి.

ఇలాంటి వారు  ఒక్క రాత్రిలోనే.. బిలియన్లగా,  కోటేశ్వర్లుగా మారిపోవాలనే ఆశతో.. శాసనసభ, పార్లమెంటు సభల  వైపు వస్తున్నారని. మీడియా ప్రజలు అంటున్నారు.  వీరు ఎన్నికల్లో  పోటీ చేసి  తన గెలవటానికి ..20, 30 కోట్లు వరకు ఖర్చు పెట్టి.. ప్రజల చేత ఎన్నుకోబడి శాసనసభల్లోకి, పార్లమంట్ సభల్లోకి  అడుగు పెట్టి.. తన అధికారతో.. ధనధహం తీర్చుకుంటున్నారని , మీడియా శ్రేణులు అంటున్నాయి. ఇలాంటి వారికి రక్షణ కవాచాలుగా .. సొంత మీడియాను,  పేపర్  మీడియా  పెట్టుకొని .. వీరు చేస్తున్న నేరాలు , ఘోరాలు పక్కన పెట్టి..ఉన్నవి లేనట్టుగా,  చూపించి అర్థంకాని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుంటున్నారని రాజకీయ సీనియర్ నాయకులు అంటున్నారు..  అలాంటి మీడియాలో సాక్షి టీవీ, సాక్షి పేపరు ఒకటి. ఈ మీడియా  ప్రజలకు ఉపయోగ పడే విషయాలను చెప్పకుండా ..సొంత డబ్బకొట్టుకుంటు, ప్రచార సాధనాలుగా ఎన్నికల బరిలోకి దిగిన నాయకులకు బాగా ఉపయోగపడుతున్నాయాని  మీడియా శ్రేణులు అంటున్నారు.

అంతేకాకుండా.. ఇలాంటి వారు ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. ముందుగా 20, 30 కోట్లుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారట.  ఉదాహరణకు .. కడప, బళ్ళారి, గుంటూరు, నెల్లూరు,  కర్నూలు, ఇంక కొన్ని నియోజక వర్గలలో 20, 30 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి వారు ప్రజాస్వామ్యంలో రావటం వలన  ప్రజా వ్యవస్థ , న్యాయ వ్యవస్థ , పోలీస్ వ్యవస్థ , రాజకీయ వ్యవస్థలు, నష్టం జరుగుతుందని సామాన్య ప్రజలు అంటున్నారు. నిజాయితీగా పనిచేసే నాయకులు లేకపోవటంతో.. వలన రాష్ట్ర ఆర్థిక పరిపాలన వ్యవస్థ  చాలా దెబ్బతింటుందని మేధావులు సంఘం అంటుంది.

ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు సేవ చేసే నాయకులు కావాలి గానీ..  ప్రజల చేత ఎన్నుకోబడి..  ప్రజలకు తెలియకుండా లక్ష కోట్లు , లక్ష గదులు స్థలాలు, దండుకోవటం ఎంతవరకు న్యాయమో ప్రజలే ఒక్కసారి ఆలోచించుకోవాలని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.  ఇప్పుడు వచ్చే నాయకులు అంత వ్యవస్థను బ్రష్టుపట్టించే వారే గానీ,.. ప్రజా స్వామ్య వ్యవస్థను . బాగు చేసే నాయులు లేరు అని మీడియా శ్రేణులు అంటున్నాయి.  ఎన్నిలక బరిలో నిలబడిన వెంటనే  గుర్తుకు వచ్చేంది .. మా కులం, మా మతం, మావాడు, మా బందువు, ఇలాంటి భావాలు కలిగిన నాయకులు ఆంద్రప్రదేశ్ లో పిచ్చిమొక్కల్లా పుట్టుకొస్తున్నారని రాష్ట్ర మేథావుల సంఘం అంటుంది.

ఇలాంటి అవినీతి వ్యవస్థ గతంలో ఎప్పడు లేదట. కేవలం 7  -8 సంవత్సరాల నుండి .. ఆంధ్ర ప్రదేశ్ మొత్తం పాకిపోయిందని  ప్రజలు చెబుతున్నారు. మన రాష్ట్రంలో ఉన్న మీడియా ఏ రాష్ట్రాంలో లేదని  ప్రపంచ సర్వేలో తెలిపోయిందట. కొంత మంది సొంత మీడియా పెట్టుకొని అక్రమ దందాలకు తెర తీస్తున్నారట.  కులం , మతం, పేరుతో  తెలంగాణ కోసం ఒక ఛానల్, తెలుగుదేశం పార్టీ కోసం  స్టూడియో ఎన్, ఈటీవీ గా, కాంగ్రెస్ పార్టీ కి వి6 టీవీ న్యూస్ మీడియాలు ఉండటంతో..  ప్రజా విలువలు మరిచి .. తమ రెటింగ్ కోసం .తమ ప్రచార సాధనాలుగా  పేరు పడిందని  సామాన్య ప్రజలు అంటున్నారు.  ఇంకా చెప్పాలంటే..  సాక్షి మీడియా.. ఇది కేవలం  జగన్ కు సంబందించిన వ్యక్తులు, ఆస్తులు, పనులు, విషయాలు తప్ప .. మిగత అందరిది కుట్ర, అవినీతి , అక్రమం అని అర్థంకానీ ప్రజలకు చెప్పే సాధనంగా , జగన్ కు మాత్రమే ఉపయోగపడుతుందని  రాష్ట్ర మేథావుల సంఘాలు అంటున్నాయి.  కేవలం ఒక హిందు పత్రిక మాత్రమే  తమ విలువలను కాపాడుకుంటుందని ప్రజలు అంటున్నారు.

అసలు మీడియా గానీ, ఒక పత్రిక గానీ  ప్రజలకు న్యూస్  రిపోర్టు చేయాలే గానీ.. పత్రికలు , మీడియాలు డిసైట్ చేయకూడదు? కానీ ఇప్పడు మీడియా, పత్రికలు చేస్తున్నది ..కేవలం న్యూస్ ను డిసైట్ చేస్తుందని సామాన్య ప్రజలు అంటున్నారు. దీనివలన  ప్రజా స్వామ్యంలో  ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని  తెలుసుకోవాలి? అంతేకాకుండా  విద్యా వ్యవస్థ చిన్నబిన్నమైందని అంటున్నారు.  ఎందుకంటే.. రాజకీయ నాయకులు పలుకుబడితో..తన తస్సమ్మదీయులకు, రౌడీలు, కాంట్రక్టర్లలకు , ఇంజనీరింగ్ కాలేజీల లైస్సెన్స్ ఇవ్వటంతో..అక్రమ, అవినీతి పెరిగిపోయి సొమ్ము దోసుకోనే కాలేజీగా మారిపోతున్నాయాని సామాన్య ప్రజలు అంటున్నారు. విలువలతో కూడి విద్యా దొరకటంలేదని యువకులు అంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితిలో .. ఎన్నికల బరిలో ఎమ్మెల్యేగా నిలబడాలి అంటే.. కనీసం అభ్యర్థి దగ్గర 25 కోట్లు ఉండాలట, అలాగే పార్లమెంట్ టిక్కెట్ దక్కాలంటే.. 100 కోట్లు ఉంటేగానీ  పార్లమెంట్ లో అడుగుపెట్టలేమని సామాన్య ప్రజలు అంటున్నారు. అసలు ఈ వ్యవస్థ ఇలా మారాటానికి కారణం  వైఎస్ రాజశేఖర్ రెడ్డేనట 2004 లో ప్రజల చేత ఎన్నుకున్నారు కాబట్టి  మనం ఏం చేసిన చెల్లుతుందనే ధోరణితో ప్రవర్తించటం వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని  తెలుగుదేశం నాయకులు అంటున్నారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డికి ఉన్న చర్మిషా వలన  తెలుగుదేశం నాయకులు అడగలేకపోయారని వారు అంటున్నారు. ఎంతో నిజాయితీగా ఉంటే  లోక్ సత్త అధినేత జయప్రకాష్ నారాయణ ప్రజా స్వామ్యం విలువల, వ్యవస్థ  గురించి  ప్రజా నాయకులకు గుర్తుచేస్తున్నప్పటికి పెద్దగా ఫలితం దక్కలేదని కమ్యునిష్టు నాయకులు అంటున్నారు.

జయ ప్రకాష్ నారాయణ  ఎన్నో సార్లు  తన మాటల్లో.. ఎన్నికల్లో .. మంచి నాయకుడికి ఓటు వేయండి? డబ్బుకు, మద్యంకు , అవినీతికు విలువ ఇవ్వకండి. మంచి ప్రజా నాయకుడిన్ని  ఎన్నుకోమని గొంతు చించుకోని అరిచినా ప్రజలు వినిపించుకోలేదని  రాష్ట్ర మేథావుల సంఘం అంటుంది. ఎన్నికల్లో  ఒక ఫీజు, ఒక ఇల్లు,  ఒక వ్యక్తిని ఆర్థికంగా ఆదుకోని ఓట్లు గడించి   ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ కోటేశ్వర్లు ఎక్కువైపోతున్నారని  మీడియా శ్రేణులు అంటున్నాయి.  ప్రజలు ఓటు హక్కును  వినియోగించుకోని .. మంచి ప్రజ నాయుడు ఎన్నుకుంటే.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ , మెరుగుపడుతుందని మేథావులు అంటున్నారు.  రాబోయే ఎన్నికల్లోనైనా ప్రజలు  తమ ఓటును అవినీతి, అక్రమా , భూకబ్జ ,రౌడీలకు వేయకుండ , ప్రజలకు సేవా చేసే నాయకుడ్ని ఎన్నుకోనే విధంగా ఆలోచించాలని   రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.

ప్రజా స్వామ్య వ్యవస్థలో .. ప్రజలు చేత ఎన్నుకోబడి వ్యక్తులు  ,తండ్రి పదవిని అడ్డుపెట్టుకోని లక్ష కోట్లు సంపాదించిన జగన్, లక్ష అడుగుల స్థలంలో ఇల్లు కట్టుకున్న జగన్,   కొండలను మాయం చేసి  కనకసింహాసం పై కూర్చున్న  గాలి జనార్థన్ రెడ్డి,  10 కోట్లు లంచం తీసుకున్న జడ్జీ పట్టాబి రామ్,  15వేల ఎకరాలు భూమిని  అక్రమంగా కట్టబెట్టిన మంత్రి మోపిదేవి వెంకట రమణ, అలాగే ఎక్కడ పడితే అక్కడ సంతం చేస్తే  ఐఏఎస్ అధికారి శ్రీలక్మీ,  బెయిల్ విషయం లంచం కోసం చేయి చాపిన మంత్రి  ఏరాసు ప్రతాప్, వీరే కాకుండా ఇంక చాలా మంది ఉన్నారు,  అలాంటి వారిని ఎన్నుకోవద్దని  సీనియర్ మేథావులు అంటున్నారు.

ప్రజాస్వామ్యంలో  సైకిల్ పై అసంబ్లీకి వచ్చి.. ప్రజల కోరకు పాటుపడిన  పుచ్చలపల్లి  సుందరయ్య ,  వావిరాల  గోపాల్ క్రిష్ణ , చండ్ర రాజేశ్వరావు, మకునేని  బసవ పున్నయ్య లాంటి నాయుకులను అందించిన రాష్ట్రం మనది.  కానీ జగన్, గాలి,  రోజా , మోపిదేవి, పట్టాబి, శ్రీలక్ష్మీ , నాయకులు, అధికారు వలన ఆంద్రరాష్ట్ర ఏమవుతుంది?  అసలు మన వ్యవస్థలో ఏం జరుగుతుంది? మనం ఆంద్రప్రదేశ్ లో ఉన్నామా? లేక అవినీతి ప్రదేశ్ లో ఉన్నామా?  అని చదువుకున్న యువకులు ఆలోచించాలి.  అంతేకాకుండా  ప్రతి ఒక్కరు  మాకులం, మామతం, మావాడు, అనేవి మరిచిపోయినప్పుడే   మన ప్రజా స్వామ్యం, వ్యవస్థ బాగుపడుతుందని  సీనియర్ మేథావులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhrawishesh
Tamil actress nayanthara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more