'సింహా' చిత్రంతో టాప్ స్టార్గా తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్న హీరో నందమూరి బాలకృష్ణ. ఆ తర్వాత దాసరి నారాయణ రావు దర్శకత్వంలో ఆయననటించిన 'పరమవీరచక్ర' చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అనంతరం బాపు దర్శకత్వంలో విడుదలైన 'శ్రీరామరాజ్యం' క్లాస్ చిత్రంగా వాసికెక్కింది. కానీ కలెక్షన్లపరంగా అంతగా సందడి చేయలేకపోయింది. ఆ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం 'అధినాయకుడు'. జయసుధ, లక్ష్మీరాయ్ హీరోయిన్లు. పరుచూరి మురళి దర్శకుడు. ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మాత. 'అధినాయకుడు' చిత్రంలో బాలకృష్ణ వెరైటీ గెటప్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ సర్కిల్స్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రాన్ని తొలుత మహాశివరాత్రికి విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాతి నుంచి సినిమా విడుదల వాయిదా పడుతూనే వస్తున్నది. వరుస వాయిదాలతో అభిమానులు ఒకింత నిరాశపడుతున్నారు. గతంలో విడుదల కావటంలో జాప్యమైన చిత్రాల ఫలితాలు వారిని బెంబేలెత్తిస్తున్నాయి. అంతా అనుకున్నట్లుగా జరిగితే 'అధినాయకుడు' చిత్రం కూడా మే మాసంలో విడుదల కావాల్సి ఉంది.
గతంలో ఫ్లాప్ చిత్రాలు చవిచూసిన టాలీవుడ్ అగ్రహీరోల చిత్రాలు మే మాసంలో విడుదలకు వరుస కడుతున్నాయి. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా కలెక్షన్లలో రికార్టులు సృష్టించిన 'దబంగ్' చిత్రం ఆధారంగా తెలుగులో 'గబ్బర్ సింగ్' రూపొందింది. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బండ్ల గణేష్ బాబు నిర్మాత. హరీష్ శంకర్ దర్శకుడు. మే తొమ్మిదవ తేదీన 'గబ్బర్ సింగ్' విడుదల కానుంది. 'కొమరం పులి', 'తీన్మార్', 'పంజా'.. ఇలా వరుస ఫ్లాప్లతో స్టార్డమ్ను నిలబెట్టుకోవటంలో ఒకింత ఇబ్బంది పడుతున్న పవర్స్టార్కు 'గబ్బర్ సింగ్' చిత్రం ఫలితం అత్యంత కీలకం. ''నాక్కొంచెం తిక్కుంది.. అందుకో లెక్కుంది'' అంటూ పవన్ కళ్యాణ్ పంచ్ డైలాగులతో విడుదలైన సినిమా ట్రైలర్ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెతిస్తున్నది. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ఆడియో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది.
మాస్ మహారాజాగా సినిమా టైటిల్స్లో కనిపించే హీరో రవితేజ తాప్సీతో కలిసి 'దరువు' చిత్రంలో నటించారు. ఈ చిత్రం మే 18న విడుదల కానుంది. శివ దర్శకుడు. 'దరువు' చిత్రం విడుదలకు సైతం వాయిదాల బెడద తప్పలేదు. తొలుత ఏప్రిల్ చివరి వారంలో, ఆ తర్వాత మే నాల్గవ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. చివరగా మే 18న విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు. సంగీత దర్శకుడు విజయ్ ఆంథోని తొలిసారిగా రవితేజ చిత్రానికి సంగీతం అందించారు. ప్రముఖ దర్శక, నిర్మాత వై.వి.ఎస్.చౌదరి నిర్మాతగా గుణశేఖర్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన 'నిప్పు' చిత్రం రవితేజ కెరీర్లో భారీ డిసాస్టర్ చిత్రాల్లో ఒకటిగా అగ్రస్థానంలో నిలిచింది. అంతకుమునుపు వచ్చిన 'వీర' చిత్రం కూడా రవితేజకు నిరాశ మిగిల్చింది. దాంతో 'దరువు' చిత్రం ఫలితం రవితేజ కెరీర్కు ఎలాంటి ఊతమిస్తుందనేది చూడాలి.
హీరోల పరిస్థితి ఇలా ఉండగా సాంకేతికంగా అద్భుతమైన ప్రయోగాలతో సాదాసీదా కథతో రూపొందిన చిత్రాన్ని సైతం ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేయటంలో ఘనత వహించిన దర్శకుడు రాజమౌళి 'ఈగ' చిత్రంతో మే నెల బరిలో నిలిచారు. నాని, సమంత, కన్నడ నటుడు సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈగ దేహంలో ప్రవేశించిన హీరో ఆత్మ.. విలన్పై ఎలా పగ తీర్చుకున్నాడనే ఆసక్తికరమైన కథతో రూపొందిస్తున్న 'ఈగ' చిత్రాన్ని మే 30న విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more