కృష్ణాజిల్లా టిడిపి నేత వల్లభనేని వంశీకి తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. నిన్న విజయవాడ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ను ఎందుకు కలిశారో వివరణ ఇవ్వాలని కోరింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకే వంశీకి నోటీసులు జారీ చేశామని ఆ పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.
ఇదిలా ఉండగా, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ ను టీడీపీ నేత వల్లభనేని వంశీ నిన్న కలుసుకున్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న జగన్ అభిమానులతో ర్యాలీగా వెళుతుండగా నడిరోడ్డుపైనే వంశీ ఆయనను కలుసుకున్నారు. కాసేపు ముచ్చటించారు. వీరి భేటీతో కృష్ణా జిల్లా రాజకీయాల్లో కలకలం రేగింది. వంశీ కూడా జగన్ గూటికి చేరుతారా అన్న ప్రచారం ఊపందుకుంది.
ఇదిలా ఉండగా, పరిస్థితులు నిశితంగా గమనిస్తే, విజయవాడలో సరికొత్తరాజకీయాలకు తెరలేస్తున్నట్టు అగుపిస్తోంది. జిల్లాలో బలమైన వర్గ పునాది కలిగి ఉన్న ఒక వర్గానికి ల్యాండ్ మర్క్ గా ఉన్న వంగవీటి కుటుంబానికి చెందిన రాధాకృష్ణ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరో నేత వల్లభనేని వంశీ జగన్ ను కలుసుకున్నారు. ముగ్గురూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. వాస్తవానికి ఇద్దరూ మంచి మిత్రులు కావడం...రాధా వైఎస్ఆర్సీపీలో చేరుతున్న సమయంలో వంశీ కలుసుకోవడం రాజకీయంగా చర్చకు తెరతీసింది. వాస్తవానికి రాజకీయాలకు అతీతంగా వంగవీటి రాధాకృష్ణ, వల్లభనేని వంశీ, కొడాలి నానిలు మంచి స్నేహితులు. తరచూ ఈ ముగ్గురు కలుస్తుంటారు కూడా. ఈ నేపథ్యంలో రాధా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడం వెనుక వంశీ, నానిల ప్రోత్సాహం ఉన్నట్లుగా తెలుస్తోంది. తరువాత వల్లభనేని వంశీ, కొడాలి నానిలు కూడా రాధా తరహాలోనే టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పంచన చేరతారా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
జిల్లాలో తెలుగుదేశం పార్టీలో యువనేతలుగా..ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ కుటుంబాలతో సత్సమ సంబంధాలు ఉన్న నేతలుగా వల్లభనేని వంశీ, కొడాలి నానిలకు పేరుంది. జూనియర్ ఎన్టీఆర్ తో మంచి స్నేహసంబంధాలు, కుటుంబ ఆత్మీయ బంధాలు కూడా ఉన్నాయి. వీరిద్దరూ టీడీపీని వీడాలంటే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల అనుమతి తప్పనిసరి. మరోపక్క టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా నాయకత్వం వీరికి మింగుడు పడటం లేదు. మొత్తానికి రానున్న రోజుల్లో చిత్రం ఎలా మారుతుందో వేచిచూడాలి.
తాజా వార్త ఏంటంటే... టీడీపీ విజయవాడ నగర అధ్యక్ష పదవి నుంచి వల్లభనేని వంశీకి ఉద్వాసన పలికారు. ఆయన స్థానంలో బొండా ఉమామహేశ్వరరావును నియమించాలని టీడీపీ భావిస్తోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more