జైపాల్-కిరణ్ మధ్య కొనసాగుతున్న పరోక్ష యుద్ధంలో ఇప్పుడు గ్యాస్ సరఫరా అంశం కొత్త వివాదాల జాబితాలో చేరింది. ముఖ్యమంత్రి కిరణ్కు మార్రెడ్డి - కేంద్రమంత్రి జైపాల్రెడ్డి మధ్య పరోక్ష యుద్ధం ఇంకా కొనసాగుతోందా? వారిద్దరి మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతోందా? తాజాగా ఢిల్లీలో జరిగిన గ్యాస్ ఒప్పంద సంతకాల కార్యక్రమంలో వారిద్దరి వ్యాఖ్యలు పరిశీలిస్తే పార్టీ వర్గాల్లో ఇలాంటి అనుమానాలే తెరపైకి వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా లోని నేదునూరు, హైదరాబాద్ అవసరాలు తీర్చేందుకు జైపాల్రెడ్డి ప్రాతినిధ్యం వహి స్తోన్న శంకర్పల్లిలో నిర్మించతలపెట్టిన 2100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు గ్యాస్ సరఫరా చేయాలని సీఎం కిరణ్.. అదే సభలో ఉన్న కేంద్రమంత్రి జైపాల్రెడ్డిని కోరారు. గ్యాస్ సరఫరాలో జరుగుతున్న ఆలస్యం వల్ల నేదునూరు ప్రాజెక్టు చాలా కాలం నుంచీ పెండింగ్లో పడిందని వ్యాఖ్యానించారు.
జైపాల్రెడ్డి ఈ విషయంలో పట్టించుకోక పోవడం వల్లే ఆలస్యం జరుగుతోందన్న అర్ధం ధ్వనించేలా కిరణ్ వ్యా ఖ్యానించారు. జైపాల్రెడ్డి కూడా సీఎం వ్యాఖ్యలకు ధీటుగానే స్పందించారు. ఆయన కూడా కిరణ్కుమార్రెడ్డి వైఫల్యాన్ని పరోక్షంగా ఎత్తి పొడిచారు. ప్రాజెక్టులు పూర్తి చేసి గ్యాస్ అడిగితే బాగుంటుందని చురకలు అంటించారు. ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే గ్యాస్ ఇస్తామని నిర్మొహమాటంగా చెప్పడంతో కిరణ్ ఖంగుతినవలసి వచ్చింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్ పరిశ్రమలకు గ్యాస్ కొరత ఉన్నందున, పని పూర్తి కానిదే గ్యాస్ ఇవ్వడం కుదిరే పని కాదని తెగేసి చెప్పారు. తన నియోజకవర్గంలోని శంకర్పల్లి, నేదునూరు ప్రాజెక్టులు అవసరమే అయినప్పటికీ, అసలు ప్రారంభం కాని ప్రాజెక్టులకు గ్యాస్ ఇవ్వడం కుదరదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో కిరణ్ నిరాశ చెందవలసి వచ్చింది. ఇదిలాఉండగా.. గ్యాస్ సరఫరా అంశంలోనే కాకుండా రాజకీయపరమైన విషయాల్లోనూ జైపాల్-కిరణ్ మధ్య విబేధాలు కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తన రాజకీయ ప్రత్యర్ధులను జైపాల్ ప్రోత్సహిస్తున్నారన్న అనుమానం, అసంతృప్తి కిరణ్లో ఉందని ఆయన అనుచర వర్గం చెబుతోంది. జైపాల్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, జనారెడ్డిని తనకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని కిరణ్ వర్గీయులు మండిపడుతున్నారు. తనను మార్చాలని ప్రయత్నిస్తోన్న వారికి జైపాల్ దన్నుగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. బొత్స, దామోదర రాజనరసింహ తరచూ జైపాల్ను కలుస్తున్న విషయాన్ని కిరణ్ వర్గీయులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఎంపీలను తనకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారని భావిస్తోన్న కిరణ్, తనకు వ్యతిరేకంగా అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారని అనుమానిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రానికి రావలసిన గ్యాస్ను సాంకేతిక కారణంతో ఆపుతున్నారని కిరణ్ అనుమానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more