రాష్ట్ర కాంగ్రెస్ కు కేరళ ఆయుర్వేద చికిత్స మొదలైంది. అజాదూ మంత్రం పనిచేయకపోవడంతో హైకమాండ్ ఇక పంచకర్మ ప్రారంబించింది. ఏపీ కాంగ్రెస్ పరిస్థితులను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని కేరళ సీనియర్ నేత వాయలార్ రవిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు మంచిరోజులు వస్తున్నాయని నేతలు భావిస్తున్నారు. కుమ్ములాటలకు కేరాఫ్ గా మారిన రాష్ట్ర కాంగ్రెస్ కేరళ ఆయుర్వేద చికిత్సతో దారిలోకి వస్తారని అనుకుంటున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జ్ ఆజాద్ ఉన్పప్పటికి మరో సీనియర్ నేత వాయలార్ రవిని హైదరాబాద్ కు పంపించడం వెనక కారణమిదే అని నేతలు చెప్పుకుంటున్నారు. అధిష్టానం దూతగా గాంధీభవన్ కు వచ్చిన వాయలార్ అందరి అభిప్రాయాలను స్వీకరించారు. ఆజాద్ ఉన్నప్పుడు కొందరు ఆయన మాట వినేవారు కాదనే అప్రతిష్ట ఉంది. అందుకే అందరినీ దారిలో పెట్టగల సమర్థుడిగా పేరున్న వాయలార్ నే సోనియా ఎంపిక చేశారని తెలిసింది. మరి కేరళ పంచకర్మ వైద్యం పని చేస్తుందో లేదో చూడాలి.
ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు వాయిలార్ రవి చేస్తున్న పర్యటనతో అసంతృప్తి జ్వాలలు మరింత పెరిగే ప్రమాదం ఉందని కిరణ్కుమారరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచా రం. రవికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి మధ్య సన్నిహిత సంబంధా లుండడంతో ఆయన పర్యటన వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని కూడా సిఎం తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారని తెలుస్తున్నది. గులాం నబీ ఆజాద్ పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడుగా కొనసాగుతున్న నేపథ్యంలో వాయి లార్ రవి పర్యటనతో కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని సిఎం కిరణ్కుమార్రెడ్డి సోనియాకు వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకే సిఎం హస్తిన పర్యటనకు వచ్చినట్లు ఏఐసిసి వర్గాలు చెప్పుకుంటున్నాయి.
కాగా, ఢిల్లీ పర్యటన సందర్భంగా కిరణ్ వరుసగా అగ్రనాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తప్పులను సరిదిద్దుకుంటానంటూ వేడుకున్నారు. ఇప్పటికే రాష్ట్రం తీరుతెన్నులు మారిపోయాయని, ఉద్యమాల నుంచి బయటపడుతున్నామని కష్టాలన్నీ ఏకరువు పెట్టారు. తన అభివృద్ధి మంత్రానికి రాజకీయ చెదలు పట్టాయని, ఎంత కృషిచేస్తున్నా కొందరు నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి కొరవడిందంటూ తప్పుడు నివేదికలు అధిష్ఠానానికి అందిస్తున్నారంటూ ఆవేదన వెళ్లగక్కారు. తన మంత్రివర్గంలోని కొందరు మంత్రులు సైతం తనపై కక్షకట్టి ప్రభు త్వాన్ని ఆభాసుపాలు చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆయన అగ్రనాయకులతో చె ప్పుకున్నారు. ఈ మారు ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పూర్తి స్థాయి ప్రణాళికను అమలుచేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.
రాష్ట్రంలో పార్టీని గాడిన పెట్టేందుకు వచ్చిన వాయిలార్ రవి పర్యటనలో తనకు వ్యతిరేకంగానే పార్టీ శ్రేణులు ఇచ్చిన నివేది కలపై తాను ఇప్పుడేమీ సమాధానం ఇవ్వలేనని సీఎం అధిష్ఠానం నాయకులకు విన్నవించుకున్నట్లు తెలుస్తున్నది. తనకు బొత్సకు మధ్య ప్రత్యక్ష యుద్ధం కేవ లం మీడియా సృష్టించిందేనంటూ సిఎం నాయకులకు సర్దిచెప్పేందుకు యత్నిం చారని తెలుస్తున్నది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more