పతియే దైవంగా భావించే సంప్రదాయం మనది. పెళ్లి నాడు చేసుకున్నా బాసలు,ఏడాడుగుల బంధం తో కలిసి తలంబ్రాలు సాక్షి గా పతిని చేసుకున్న తరువాత కష్టమైన నష్టమైన భార్య భర్తకు తోడుగా ఉంటుంది. ఇప్పడు అదే పరిస్థితి చంచల్ గూడ జైలు వద్ద కూడా జరుగుతుందని అంటున్నారు. ఇన్ని రోజుల తమ భర్తలకు ఇంట్లో సేవాలు చేసిన వారు ఇప్పడు జైలు వద్ద కూడా తమ భర్తలకు సేవాలు అందించటానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తుంది.
గతంలో చంచల్ గూడ జైలుకు సామాన్య కుంటుంబల నుండి ఖైదీల బందువులు వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు చంచల్ గూడ జైలుకు వచ్చే బంధువులు అందరు ఉన్నత కుటుంబనికి చెందినవారు, అదీ కూడా ప్రభుత్వ ఉద్యోగులైన వారు ఎక్కువగా వస్తున్నారని పోలీసులు అంటున్నారు. మొన్న గాలి జనర్థన్ రెడ్డి భార్య, చంచల్ గూడ జైలుకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే బాటలో చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను ఆయన భార్య, ఐఏఎస్ అధికారి రంజీవ్ఠక్కర్ ఆచార్య పరామర్శించారు. బీపీ ఆచార్య భార్య ఆయనను జైల్లో మొదటిసారిగా కలిసి మాట్లాడారు. కేసు విషయంపై చర్చించినట్లు సమాచారం. కాగా సూర్య పత్రిక అధినేత నూకారపు సూర్య ప్రకాశరావును ఆయన భార్య, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఆమె భర్త సీఐడీ ఐజీ గోపీకృష్ణ, విజయసాయిరెడ్డిని సాక్షి గ్రూప్ ప్రతినిధులు కలిశారు.
హోం శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి, ఎమ్మార్ కేసులో ప్రధాన నిందితుడు బీపీ ఆచార్యను ప్రత్యేక తరగతి ఖైదీగా గుర్తించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఐఏఎస్ అధికారిగా ఉన్న తనను ప్రత్యేక తరగతి ఖైదీగా పరిగణించాలని కోరుతూ ఆచార్య దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ఉన్నత విద్యనభ్యసించి ఉన్నతస్థాయి అధికారిగా పనిచేసినందున ఆయన వినతిని కోర్టు మన్నించింది.కాగా, ఎమ్మార్ కేసులో ఆచార్యకు అన్నీ తెలిసే జరిగాయన్న సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకుని ఆయనకు బెయిల్ ఇవ్వడానికి సీబీఐ కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనికి కారణాలు కోర్టు వివరించింది.
కేసు దర్యాప్తులో భాగంగా విజయరాఘవ, సునీల్రెడ్డిని ఇంకా ప్రశ్నించాలని, వారు జైల్లో ఉన్నందున అదే కేసులో నిందితుడైన ఆచార్యకు బెయిల్ ఇవ్వడం సరికాదన్న సీబీఐ వాదనతో ఏకీభవించినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. నిందితుడిని విడుదల చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని సీబీఐ పేర్కొన్న అంశాలను ఉత్తర్వుల్లో ప్రస్తావిస్తూ..బెయిల్ తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. కాగా తమను అరెస్టు చేసిన సందర్భంగా సీబీఐ స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించిన హెలికాప్టర్, లగ్జరీ కార్లను తిరిగి అప్పగించాలని కోరుతూ గాలి జనార్దన్రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్పై వాదనలను కోర్టు వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more