రాష్ట్ర కేబినెట్లో బెర్త్కోసం పట్టువిడవని విక్రమార్కుడిగా ఢిల్లీకి వెళ్లి తన శాయశక్తులా కృషిచేసిన గండ్ర వెంకటరమణారెడ్డికి ఎట్టకేలకు ప్రభుత్వ చీప్విప్ పదవీ కట్టబెట్టారు. గత రెండు సార్లు జరిగిన విస్తరణలో మంత్రిపదవి వస్తుందన్న ఆశతో ఉన్న గండ్రకు చివర్లో మంత్రి పదవీ లభించకపోవడంతో అలకమానిన గండ్రను కాంగ్రెస్పార్టీ చీఫ్ విఫ్ పదవి లభించింది. శాసన సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చీప్విఫ్, మరి కొంతమందిని విప్లుగా నియమిస్తూ ప్రకటించారు. శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్గా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నియమితు లయ్యారు. విప్లుగా ఆరేపల్లి మోహన్, ద్రోణం రాజు శ్రీనివాసరావు, పేర్ని వెంకటరామయ్య (నాని)- మచిలీపట్నం, తూర్పు, జయప్రకాశ్రెడ్డి (సంగారెడ్డి), ఎ. అనీల్ (బాల్కొండ)లను నియమి స్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్త ర్వులు జారీచేసింది.
వీరితోపాటు మండలి విప్గా రుద్రరాజు పద్మరాజును నియమించారు. భారతీ ధీరావత్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇప్పటికే మండలి విప్గా శివరామిరెడ్డి కొనసాగుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాలు, పార్టీలోని అసమ్మతినేతలను అధిగమించేందుకు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పకడ్బందీ వ్యూహంతో ముందుకు దూసుకెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో తన సొంత ముద్ర వేసుకునేందుకు స్నేహితులు, నమ్మినబంట్లకు పదవుల పందేరానికి తెరలేపారు. పార్టీ అధిష్ఠానవర్గానికి ఆయనకు వ్యతిరేకంగా అబద్దాలు చెప్పి, పదవికి ఎసరు పెట్టే సీనియర్ నేతలను పక్కనపెట్టే ప్రయత్నాలు దాదాపుగా ఫలిస్తున్నాయని చెప్పవచ్చు. వ్యతిరేకులకు అడుగడుగునా అడ్డుకట్ట వేస్తూ పార్టీలో, ప్రభుత్వంలో తానే నంబర్-1గా చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తూనే, మరో పక్క ఆయన వ్యతిరేఖవర్గ నేతల ముఖ్య అనుచరులుగా ముద్రపడిన ఎమ్మెల్యేలను చేరదీసి ‘పదవుల’ పంపిణీతో నల్లారి సొంత బలాన్ని పెంచుకుంటున్నారు.
ఇందులో భాగంగానే రాష్ట్ర శాసనసభ చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా ఆరు పదవులు పంపకం చేశారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి రెండు పదవులు సిఎం కట్టబెట్టారు. ఇందులో చీఫ్విప్ పదవికి వరంగల్ జిల్లానుంచి గండ్ర వెంకటరమణారెడ్డిని ఎంపికచేయడంతో పాటు, డిప్యూటీ సీఎం నమ్మినబంటు, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డికి విప్ పదవి కట్టబెట్టి తన వర్గం నేతగా ముద్రవేశారు. ఇటీవల జయప్రకాశ్రెడ్డికి డిప్యూటీ సీఎం రాజనర్సింహ మధ్య విభేదాలు తలెత్తడంతో దీన్ని సీఎం సొమ్ముచేసుకున్నారు.
కాగా విశాఖపట్నం నుంచి బ్రాహ్మణ వర్గానికి చెందిన ద్రోణంరాజు శ్రీనివాస్కు పదవి కట్టబెట్టడం ఆ వర్గ ప్రజలకు చేరువయ్యేయత్నంలో భాగంగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. కృష్ణ జిల్లాకు చెందిన కాపు వర్గానికి చెందిన పేర్ని నాని, కరీంనగర్కు చెందిన మాదిగ సామాజికి వర్గానికి ఆరేపల్లి మోహన్, నిజామాబాద్ జిల్లా నుంచి పద్మశాలి వర్గానికి చెందిన అనీల్ను ఎంపికచేయాడాన్ని చూస్తే అన్నీ ప్రాంతాల నుంచి అన్నీ వర్గాలను ఆదరించినట్లవుతుందని సిఎం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే మండలి నుంచి విప్లుగా పశ్చిమ గోదావరి జిల్లానుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రుద్రరాజును ఎంపిక చేయడం ఆ వర్గానికి అక్కున చేర్చుకోవడంతోపాటు, నల్గొండ జిల్లా నుంచి గిరిజన సామాజిక వర్గానికి చెందిన భారతికి చోటు కల్పిస్తే ఈ పదవుల్లో అన్నీ వర్గాలకు సామాజిక సమతుల్యత సాధించినట్లేనని అనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more