ప్రజలకు సేవ చేయలనే ఉద్దేశంతో.. ఉన్నత పదవికి రాజీనామా చేసి, రాజకీయ రంగు పుసుకొని, బ్లూ రంగు తో రాజకీయ జెండాతో ప్రజల వద్దకు వెళ్లటం జరిగింది. రాష్ట్రం మొత్తం తిరిగి, సభలు పెట్టి, చివరకు .. ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే దక్కించుకున్న రాజకీయ నేతలగా పేరు తెచ్చుకున్నారు లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ.
రాజకీయాలను ప్రక్షళన చేయాలని స్వయంక్రుషితో.. అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. రాజకీయ ప్రక్షాళన ఏమో గానీ, అసెంబ్లీ సాక్షిగా.. గులాబీ నేతల పిడిగుద్దులతో రాజకీయంలో ఉన్న అసలు రంగుఏమిటో తెలిసిపోయింది. ఆనాటి నుండి జేపీ ఆచి తూచి రాజకీయంలో అడుగులు వేస్తూ ముందుకు పోతున్నారు. ఇలాంటీ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రక్రియను తెరపైకి తేవటంతో జేపీ పరిస్థితి దారుణంగా మారిపోయిందని రాజకీయ నాయకులే అంటున్నారు. జేపి మొదట రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రకటన చేయటం జరిగింది. తన వాదనలను సీమాంద్రలో వినిపించాలనే ఉద్దేశంతో.. తెలుగు తేజం యాత్ర పేరుతో సమైక్యాంద్ర ప్రజల ముందుకు వెళ్లటం జరిగింది. అయితే సమైక్యవాదులు. జేపీ తెలుగు తేజం యాత్రకు అడ్డుకట్ట వేయటం జరిగింది. ముదిరిపోయిన రాజకీయలతో పాటు ప్రజలు ముదిరిపోయారనే విషయం జేపి బాగా అర్థమైంది. దీంతో జేపీ మళ్లీ యూటర్న్ తీసుకొని రాష్ట్రం పై రోజు ప్రకటన చొప్పున మీడియాలో కనిపిస్తున్నారు.
కానీ ఈ సారీ మాత్రం జేపీ ముసుగు తొలిగించి, తన రాజకీయ భవిష్యత్తును ద్రుష్టిలో పెట్టుకొని రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు జేపి రాష్ట్రంలో ఉన్న రెండు రాజకీయ పార్టీలపై ద్రుష్టిపెట్టినట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో.. జనం అంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని అంటున్నారని జేపి చెప్పటం ఆశ్చర్యం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే జేపి తన రాజకీయ భవిష్యత్తును సేప్ జోన్ చేసుకోవటానికి చాలా కష్టపడుతున్నారనే విషయం అర్థమవుతుందని రాజకీయ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కూకట్ పల్లి మళ్లీ తనకే దక్కే విదంగా రాజకీయ పావులు కదుపుతున్నరనే రాజకీయ విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే దీనిని బట్టి వైఎస్ జగన్ తో జేపి దగ్గరవుతున్నట్లు సమాచారం.
ఇక సైకిల్ బాబుతో దోస్తీ కడితే.. తన రాజకీయ భవిష్యత్తు బాగుటుందనే ఉద్దేశంలో ఉన్నట్లు రాజకీయ సమాచారం. బాబు ది, జేపి ఒక వర్గానికి చెందిన వారు కావటంతో.. రాజకీయ గాలులు అటుగా వీస్తున్నాయి. బాబుతో సంబంధం పెట్టుకుంటే.. రాబోయే ఎన్నికల్లో సైకిల్ పార్టీ తో కలిసి కూకట్ పల్లి మీద పోటీ చేయ్యలనే ఆలోచన జేపీ ఉన్నట్లు సమాచారం. అందుకే .. రాజకీయ వేత్తగా మారిపోయి, తన ముసుగు తొలగించి మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ రెండు పార్టీలలో ఏదోఒక జేపికి అవకాశం ఇస్తే.. లోక్ సత్తా పార్టీ జెండా కనిపిస్తుంది. లేకపోతే.. చిరంజీవి పార్టీ మాదిరిగానే.. లోక్ సత్తా కూడా.. మరోక పార్టీ సత్తా అయిన ఆశ్చర్యం లేదని రాజకీయ నిపుణులు అంటున్నారు. జేపి రాజకీయ జీవితం తెలుసుకోవాలంటే.. 2014 ఎన్నికల వరకు ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more