సహజంగా అందరు మీకు అంత తొందరెండుకు.. నిధానంగానే వెళ్లచ్చు కదా, అంత తొందరెందుకు .. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చు కదా, అనే మాటలకు నిత్యం వినిపిస్తుంటాయి. కానీ తొందరపాటు చర్యల వల్ల ..ప్రస్తుతం ప్రమదం లేకపోయిన.. భవిష్యత్తులో తొందరపాటు వల్ల తీసుకున్న నిర్ణయాలు ప్రమాదాలు తెచ్చే అవకాశం పుష్కలంగా ఉందని మన పెద్దలు అంటారు. అయితే .. ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన నాటి నుండి.. సీమాంద్రలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం పై నీళ్లు చల్లేందుకు కేంద్రమంత్రుల పావులు కదుపుతున్నారు. సమైక్యాంద్ర కోసం సీమాంద్ర ప్రజలు పోరాటం చేస్తుంటే.. సీమాంద్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజన కోసం తొందరపడుతున్నారు.
ఆరుగురు కేంద్రమంత్రులు.. ఆరుకోట్ల ప్రజలను తాకట్టు పెట్టేందుకు ఢిల్లీలో ఫ్యాకేజీలు కుదుర్చుకుంటున్నారు. సమైక్యాంద్ర వద్దు ..ప్యాకేజీ ముద్దు అనే నినాదంతో.. సీమాంద్ర కాంగ్రెస్ కేంద్ర మంత్రులు.. ప్యాకేజీలు కోసం ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. ఒక పక్క సమైక్యాంద్ర సై అంటూ..మరో పక్క.. రహస్య బేటీలతో.. గుసగుసలాడేకొని, కేంద్ర ముందు చేతులు సాచి ప్యాకేజీలు అడ్డుకుంటున్నారు. రాష్ట్ర విభజన ఆగిపోతుంది, సమైక్యాంద్ర కోసమే మేము కట్టుబడి ఉన్నాం అని తొడలు కొట్టిన నాయకులే.. ఈరోజు ఢిల్లీలో ప్యాకేజీల కోసం ఢిల్లీ పెద్దల చుట్టు తిరుగుతున్నారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీలు .. సీమాంద్ర కాంగ్రెస్ కేంద్ర మంత్రులకు ఉపయోగపడుతాయోగానీ, సీమాంద్ర ప్రజలకు కాదనే విషయం మరిచిపోతున్నారు.
సీమాంద్ర ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన నేరానికి .. ఈరోజు సీమాంద్ర కేంద్ర మంత్రులు.. ఆరు కోట్ల ప్రజల తలలపై బేరాలు కుదుర్చుకుంటున్నారు. చిత్త శుద్ది లేని సీమాంద్ర నేతలతో.. కేంద్రం ఇష్టం వచ్చినట్లు నాటకం ఆడుతుందని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. అంతేకాకుండా.. సీమాంద్ర నేతలు ప్యాకేజీల కోసం ఎదురుచూస్తే.. సీమాంద్ర లో మీ రాజకీయ జీవితం డ్యామేజీ అవుతుందని సీమాంద్ర ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఉద్యమం జరుగుతున్నప్పుడు మాట్లాడని నాయకులు ఇప్పుడు ప్యాకేజీల పేరుతో కొత్త తెర లేపటంతో.. సీమాంద్రలో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మీరు తొందరపడి ప్యాకేజీలతో సీమాంద్రలో అడుగుపెడితే.. తాటతీస్తామని సమైక్యావాదులు హెచ్చరిస్తున్నారు. యుద్ద భూమిలో చివరి వరకు పోరాడాలి. అంతేగానీ.. మద్యలో సందిచేసుకొని, కాసులు తీసుకొని, కలర్ ఎగరేస్తే... మీ కటౌవుట్ లు ..చిరిగిపోతాయని సమైక్యవాదులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
సమైక్యాంద్ర కోసం సీమాంద్ర నేతలుగా సీమాంద్ర ప్రజల పవర్ తో కేంద్ర వెన్నులో వణుకు పుట్టించాలి గానీ, రాష్ట్ర విభజన లొంగిపోయి, మీ డిమాండ్లు చిట్టాను బయటపెడితే.. కేంద్రం కాసులు ఇస్తుందేమో గానీ, సమైక్యవాదులు మాత్రం మీ జీవిత కాల చక్రాన్ని తిరకుండా చేస్తామని సీమాంద్ర ప్రజలు హెచ్చరిస్తున్నారు. సీమాంద్ర నేతలారా .. ప్యాకేజీలు వద్దు.. సమైక్యాంద్ర ముద్దు. తెలుగుజాతిని రెండుగా విడదీయకండని .. సమైక్యవాదులు కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more