వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాద్యక్షరాలు.. వైఎస్ విజయమ్మ వరద బాధితులను, వరదల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించటానికి తెలంగాణ ప్రాంతంలో పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన ప్రకటన చేసిన నాటి నుండి తెలంగాణ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా హవా బాగా తగ్గింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంద్రకు జై కొట్టడంతో.. తెలంగాణ ప్రాంతంలో జగన్ పార్టీకి దెబ్బతగిలింది. అయితే వరద బాధితులను ఆదుకోవటానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ ) పార్టీ నాయకులు కొన్ని కమిటీలుగా విడిపోయి.. తెలంగాణ ప్రాంతంలో సుడిగాలి పర్యాటనలు చేస్తున్నారు.
సందట్లో సడేమియాలాగా.. వైఎస్ విజయమ్మ కూడా తెలంగాణ ప్రాంతంలో వరద బాధితులను పరామర్శ పేరుతో బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే వైఎస్ విజయమ్మ పర్యటన పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. విజయమ్మను అడ్డుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నం చేయటం జరిగింది. అయితే ముందుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శల దాడికి దిగినట్లు తెలుస్తోంది.
అసలు విజయమ్మకు తెలంగాణలో ఏం పని? తెలంగాణ రైతుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం వైఎస్ విజయమ్మ కు లేదు? అయిన అప్పుడు రాని విజయమ్మ ఇప్పుడేందుకు వచ్చినట్లోనని? ఉత్తమ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థలను పరామర్శించేందుకు రాని జగన్ తల్లి .. ఇప్పుడు పంట నష్టం పేరుతో తెలంగాణ రైతులను అడ్డం పెట్టుకొని, పరామర్శకు రావడం ఖచ్చితంగా రాజకీయమే అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా.. సమైక్యవాదులం అంటూ..వీర దీక్షలు చేసి అలసిపోయిన విజయమ్మ లాంటి వారు తెలంగాణ రైతుల గురించి ఆలోచించటం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. ఇలాంటి వారు తెలంగాణ ప్రాంతంలోకి రావాల్సిన అవసరం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి .. వైఎస్ విజయమ్మకు ఉన్న పరువు ను కాస్త తీయటం జరిగిందని కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత.. వైఎస్ జగన్ ఆస్తులను కాపాడుకోవటానికి .. వైఎస్ విజయమ్మ తెలంగాణలో పర్యాటన పేరుతో తెలంగాణ ప్రజలు మోసం చేస్తుందని టీఆర్ఎస్ అంటున్నారు. సీమాంద్రలోని రైతులను ఆదుకోవాలని టీఆర్ఎస్ నాయకులు వైఎస్ విజయమ్మకు ఉచిత సలహాలు ఇవ్వటం జరిగిందని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. అయిన వైఎస్ విజయమ్మకు ఈ వయస్సులో.. ఇన్ని విమర్శలు, ఇంత రిస్క్, అవసరమా అని వైఎస్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more