వైఎస్ జగన్ ను దారిలోకి తెచ్చుకోవటం ఎలా? అనే దానిపై ఆమె ఫోకస్ పెట్టింది. జగన్ జైలు నుండి బయటకు వచ్చిన నాటి నుండి ఆమె హై టెన్షన్ మొదలైంది. ఆమెలో టెన్షన్ 2014 వరకు ఉంటుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయని ఆమెకు ఆయిల్ మెంట్ రాసే పెద్దలు చాలా మంది ఉన్నారు. కానీ ఆమె మాత్రం ఆయిల్ మెంట్ మాటలకు పడిపోకుండా.. వైఎస్ జగన్ పై ద్రుష్టి పెట్టింది. గత శనివారం హైదరాబాద్ లో జరిగిన సమైక్య శంఖారావం సభ నాటి నుండి.. ఆమెలో బీపి లెవల్స్ ఒక్కసారిగా పెరిగినట్లు సమాచారం.
సాఫిగా సాగిపోతున్న రాజకీయ జీవితంలో.. తెలంగాణ తట్టను నెత్తిపెట్టుకున్నందుకు భవిష్యత్తులో తమ రాజకీయ భవిష్యత్తు ఘోరంగా దెబ్బతింటుందనే విషయం ఆమె గ్రహించలేకపోయింది. అరవ మాటలు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పిన తాలింపు మాటలకు భయపడి .. ఢిసెంబర్-9- 2009 లో తెలంగాణ పై ప్రకటన చేయటం జరిగింది. ఆ నాటి నుండి నేటి వరకు ఆమెకు అన్ని రాజకీయ కష్టాలే కనిపిస్తున్నాయి. ఏదో కన్న కొడుకును ప్రధాని మంత్రిగా చూసుకోవాలని ఆశతోనే తెలంగాణ తట్టను నెత్తిన పెట్టుకుందని బీజేపి నాయకులు అంటున్నారు.
ఇప్పుడు తెలంగాణ తట్ట బరువు వల్ల వచ్చే తలనొప్పిల గురించి తెలుసుకోని ఆమె భయంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల పార్లమెంటు నడుస్తున్న సమయంలో ఆమె కలిగిన అనారోగ్యమే ఇందుకు కారణమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ దశలో ఫోకస్ అంత జగన్ మీద పెట్టింది... కాంగ్రెస్ పద్మవ్యూహంలోకి వైఎస్ జగన్ చిక్కుతాడా...? దారిలోకి తెచ్చుకునేదెలా...? దారిలోకి రాకపోతే ఏం చేయాలి..? 2014 ఎన్నికల తర్వాత జగన్ బాట ఎటువైపు..? యూపిఏకు మద్దతు ఇస్తాడా..? లేక బీజేపీతో దోస్తీ చేస్తాడా..? అన్నది చర్చ నీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ద్వారా సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ జగన్ను దారిలోకి తెచ్చుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నది.
కాంగ్రెస్ ప్రకటనతో సీమాంధ్రలో పార్టీ నేతలు, కార్యకర్తల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారిపోయింది. ఇక కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. 25 లోక్సభ స్థానాలు 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న సీమాంధ్రలో కాంగ్రెస్ను భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. 2014లో వైకాపా సీమాంధ్ర నుంచి 15 సీట్లు సునాయాసంగా గెలుస్తుందని నిఘా వర్గాల సమాచారం. అయితే ప్రస్తుతం లోక్సభలో కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్ నుంచి 33సీట్లు ఉన్నాయి. అన్ని సీట్లు మళ్లీ రాకపోయినా కనీసం 25 సీట్లు రెండు ప్రాంతాల నుంచి ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కానీ కైవసం చేసుకోవాలనే ఎత్తుగడలో కాంగ్రెస్ అధిష్ఠానం నిమగ్నమై ఉంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more