సీమాంద్ర నాయకులు సమైక్యాంద్ర ఉద్యమంలో ఇప్పటి వరు పాలుపంచుకోలేదు. కానీ రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రకటన చేసిన నాటి నుండి సీమాంద్ర నాయకులు కొంత మంది హైకమాండ్ పై నిప్పులు కురిపించారు. మరికొందరు మౌనం పాటించారు. కానీ ఈ నలుగురు మాత్రం సీమాంద్ర ప్రజలతో, అటూ హైకమాండ్ తో.. చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన ప్రకటన చేసిన అమ్మకు .. ముఖ్య సన్నిహితులుగా ఉంటూనే... సీమాంద్ర ప్రజలతో మమేకం అయ్యారు. ఇప్పటి వరకు వీరు రాష్ట్ర విభజనపై ఎలాంటి వ్యతిరేక ప్రకటన చెయ్యలేదు. అలాగనీ సమైక్యాంద్రకు మద్దతు తెలపలేదు. ఇప్పుడు వీరే సీమాంద్ర పై పెత్తనం చేసే స్థాయికి ఎదిగిపోయారు అనటంలో సందేహంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇద్దరు గుంటూరు జిల్లాకు చెందిన నేతలుగా మంచి పేరు ఉంది. ఒకరు అనంతపురం జిల్లా, మరోకరు నెల్లూరు జిల్లా చెందిన నేతలు. మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, కన్నా లక్ష్మినారాయణ, రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి వీరు అమ్మ భజన చేయటంలో ముదిరిపోయారు. ఈ నలుగురు అమ్మకు ఇంతగా విధేయులుగా ఉంటానికి కారణం సీఎం. అంటే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాదులేండి. ఆయన కూర్చున్న సీటు వీరిని అమ్మకు భజన పరులుగా చేయటం జరిగిందని రాజకీయ నాయకులు అంటున్నారు. అమ్మతో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి , సమైక్యాంద్ర కోసం చేస్తున్న పోరు గురించి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరి మద్య పోరు తారస్థాయికి చేరుకుందని ఢిల్లీ పెద్దలు అంటున్నారు. రీసెంట్ గా సీఎం కిరణ్ .. రాష్ట్రపతికి, ప్రధాని మంత్రికి లేఖలు రాయటంతో.. హైకమాండ్ కిరన్ పై దూకుడు పెంచింది. అందులో భాగంగా .. పిసీ చాకోను రంగంలోకి దించింది. చాకో మాట్లాడుతూ.. సీఎంకు రాజ్యంగం గురించి తెలియదని ఆయన మీడియా ద్వారా సీఎం పై చురకలు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైకమాండ్ కిరణ్ తప్పించే పనిపై కసరత్తు చేస్తుందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు సీఎం తప్పిస్తే.. సీఎం పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై అమ్మ సీమాంద్ర నాయకులు పై ద్రుష్టి పెట్టినట్లు సమాచారం.
ఇలాంటి వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ మన్ననలను పొందే ప్రయత్నం ఈ నేతలు చేస్తుననట్లు తెలుస్తోంది. వారి వ్యాఖ్యల వెనక వ్యూహం కీలక పదివి పొందడమేనని సమాచారం. ఇందుకోసం ఆ నలుగురు ఢిల్లీలో తమకు ఉన్న లాబీయింగ్ ద్వారా ప్రయత్నాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. సిఎం పదవి నుంచి కిరణ్ను తప్పిం చవచ్చన్న ప్రచారం సాగుతున్న తరుణంలో పార్టీ హైకమాండ్ మదిలో ముద్రవేసుకొంటే తమ కు కలిసి వస్తుందని ఈ మంత్రులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం తమకున్న కులం కార్డు ను కూడా వారు ప్రయోగిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
ఎస్సీ సామాజిక వర్గం నేతగా మంత్రి డొక్కా మాణిక్క వర ప్రసాద్కు పేరుంది. ఎస్సీ వ్యక్తికి కాంగ్రెస్ హైకమాండ్ అందలం ఎక్కించాల్సి వస్తే ఆయనకే అవకాశాలు మెరుగ్గా ఉన్న సూచనలు కనిపిస్తున్నా యి. సీమాంధ్ర ప్రాంతంలో బలమైన బిసి నేతగా రఘువీరారెడ్డికి పేరుంది. ఆయన ఈ కార్డుతో గతంలో సీఎం పదవికి ప్రయత్నం చేసినట్లు కథనా లు కూడా మీడియాలో వచ్చాయి. సీమాంధ్ర ప్రాంతంలో బలమైన సామాజికవర్గంగా పేరున్న రెడ్డి కులానికి చెందిన ఆనం రాంనారాయణరెడ్డి కూడా తన వ్యాఖ్యల ద్వారా పార్టీ హైకమాండ్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో సీమాంధ్రలో మరో బలమైన కాపు సామాజిక వర్గానికి చెం దిన నేతగా కన్నా లక్ష్మినారాయణకు మంచి పేరుంది. ఆయన కూడా తన సామాజిక వర్గ కార్డు ద్వారా భవిష్యత్తులో రాజకీయ సమీకరణలు మారితే వాటిని అనుకూలంగా మల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నలుగురు చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ హైకమాండ్ గుర్తిస్తుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more