జగన్ ను అందరు మొండోడు అని అంటారు. అలాంటి మొండివాడికే ఎదురుతిరిగిన జగమొండి దీక్షలు ఉన్నాయి. జగన్ ఎన్నీసార్లు దీక్షలు చేసిన వాటి ముందు ఓడిపోవటమే జరుగుతుంది. ‘‘ కాలం కలిసి రాకపోతే.. చేతి కర్ర పామై కరుస్తుందనే సామెత’’ గుర్తుకు వస్తుంది. అతి తక్కువ కాలం ఎక్కువ ప్రజా బలం సంపాదించుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 16 నెలల పాటు జగన్ శ్రీక్రిష్ణ జన్మస్థలంలో ఉన్నప్పటికి.. ఆయన ప్రజాదారణ తగ్గలేదు. జగన్ కు అన్నీ అనుకూలంగా కలిసి వస్తున్నాయి. కానీ జగన్ మొదటి నుంచి కలిసి రాని ఒక్కటే. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పాదయాత్ర కలిసి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. కానీ జగన్ కు మాత్రం సుధీర్ఘ యాత్రలు, దీక్షలు పార్టీ ప్రతిష్టను పెంచలేకపోతున్నాయనే విమర్శలు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. జగన్ కు కాలం కలిసి రావట్లేదని పార్టీలోని సీనియర్ నాయకులు వాపోతున్నారు. రాష్ట్ర విభజనను అందరికంటే ముందే తెలుసుకున్న జగన్..ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించటం జరిగిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజీనామీలతో జగన్ పార్టీ సమైక్య పార్టీ అని భావన కలిగించారు.
కానీ ఎందుకో ఏమో రాజీనామాస్త్రాలతో పార్టీకి రావాల్సినంత మైలేజ్ రాలేదని ఇప్పుడు అందరు బాధపడుతున్నారు. ఈలోపు జైలు నుంచి విడుదలైన జగన్....మైండ్ గేమ్కు పదునుపెట్టారు. లోకల్గా కేడర్ను పటిష్టపరిచేందుకు.....నెలరోజులు నిరసనల కార్యాచరణ ప్రకటించారు. ఆ తర్వాత ఆపై తానే స్వయంగా దీక్షకు దిగారు. అయితే ఇవేవి పార్టీకి తీసుకురావాల్సినంత మైలేజ్ తీసుకురాలేదనేది పార్టీ నేతల అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటు ఎపి ఎన్జీవోలతో పాటు సమైక్యాంధ్ర కోరుకునే వారంతా తమతో కలిసి వస్తారని జగన్ పార్టీ ఆశించింది. అయితే సమన్యాయం పేరిట చేసిన వాదనలో డొల్లతనం...ప్రకటనల్లో క్లారిటీ లేకపోవడంతో ఉద్యోగులతో పాటు ఇతర సంఘాలు మద్దతివ్వలేకపోయాయి.
దీంతో సీన్ రివర్స్ అయిందని గ్రహించిన ఫ్యాన్ ఫార్టీ..కొత్త ఎత్తుగడతో తెరపైకి తెచ్చింది. హైదరాబాద్లో 19న నిర్వహించే సభతో పార్టీలో పునరుత్తేజం తీసుకొచ్చేందుకు ప్లాన్లు గీస్తోంది. పార్టీ గత వైభవానికి రాజధాని సభపైనే ఆశలు పెట్టుకుంది. రాజకీయపరమైన సమస్యలన్ని జగన్ దీక్షకు అడ్డంకిగా మారడం ఒక భాగమైతే..దీక్ష తొలి రోజు పుత్తూరు లో టెర్రరిస్ట్ ల కలకలం...చివరి రోజు నటుడు శ్రీహరి మరణంతో మీడియాలో ఆశించిన ప్రచారం దొరకలేదని పార్టీ నేతలు వాపోతున్నారు. ఇలా జగన్ చేసే దీక్షలు , యాత్ర లకు కలిసి రావటంలేదని పార్టీ వర్గాలు బాధపడుతున్నాయి. ఈ సారి జగన్ ఏమైండ్ గేమ్ తో ప్రజల్లోకి వెళ్లతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more