వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే, వైఎస్ విజయమ్మ కంటే.., జగన్ ఎప్పుడు బయటకు వస్తాడని ఎదురుచూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అథినేత నారా చంద్రబాబు నాయకుడు. జగన్ కు ఈ నెలలో బెయిల్ వస్తుందని ఆపార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. అయితే చంద్రబాబు తన కుటుంబం సభ్యుల ఆస్తుల వివరాలను బయటపెట్టారు. అసలు ఇప్పుడు చంద్రబాబు ఆస్తుల వివరాలు ఎవరు అడిగినట్టు? చంద్రబాబు ఆస్తుల చిట్టాను ఎందుకు బయట పెట్టినట్టు? ఎవరైన చంద్రబాబు ఆస్తుల పై కామెంట్ చేశారా? ఒక పక్క సీమాంద్రలో ఉద్యమం వేడి రోజు రోజుకి పెరిగిపోతున్న సమయంలో.. చంద్రబాబు ఆస్తుల విషయం తెరపైకి రావటం సామాన్య ప్రజలకు అనుమానం వస్తుంది. అయితే దీని వెనుక పెద్ద మతలబు ఉందని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. చంద్రబాబు ఆస్తులు ఇన్ని కోట్లు అని ప్రకటించటం వెనుక.. రాజకీయ కుట్ర దాగి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు సీమాంద్ర ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఏ రాజకీయ నాయకుడైన ప్రజల ముందుకు వెళ్లితే.. ఉద్యమ సెగలో మడిపోతారని తెలుసు. అందుకే చంద్రబాబు ఈ సరికొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం. దీనివల్ల ప్రజలకు, చంద్రబాబు ఏం ఉపయోగం ఉంటుందని అందరు అనుకుంటారు.
కానీ ఇక్కడే పెద్ద మతలబు ఉంది. వైఎస్ జగన్ బెయిల్ మీద బయటకు వస్తే, వెంటనే సీమాంద్రలో జరుగుతున్న ఉద్యమం వైపు అడుగులు వేస్తాడు.అసలే సీమాంద్రలో జగన్ కు ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా జగన్ ఉద్యమం వైపు అడుగులు వేస్తే, సీమాంద్రలో రాజకీయ పరిస్థితి వేరుగా ఉంటుంది. అక్కడ తెలుగుదేశం, చంద్రబాబు గురించి మాట్లాడుకోవటం ప్రజలు మానేస్తారు. జగన్ కి జై అంటూ, సమైక్యాంద్రకి జై కోడుతూ ప్రజలు ఉద్యమ తీవ్రత భారీ స్థాయిలోకి పెరుగుతుంది. దీంతో ఇన్నాళ్లు జైల్లో ఉన్న జగన్ .. ఒక్కసారిగా సీమాంద్ర ప్రజలకు హీరో అవుతాడు. చంద్రబాబు జీరో అవుతాడు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు, జగన్ పై దాడి చేయటానికి ఒక ఆయుధం కావాలి కాబట్టి, అదే ఇది ఆస్తుల చిట్టా. ఇప్పడు ఆస్తులు చిట్టా బయటపెట్టి, రేపు జగన్ బెయిల్ పై బయటికి వచ్చి, సీమాంద్రలోకి వెళ్లితే.. అప్పుడు ఈ ఆస్తుల చిట్టా ఉపయోగించి జగన్ ను రాజకీయ దెబ్బతీయటానికే ఆస్తుల చిట్టా బయట పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా నా ఆస్తుల వివరాలను ప్రజలు ముందు పెట్టాను, అలాగే దమ్ముంటే, జగన్ కూడా తన ఆస్తుల వివరాలను బయటపెట్టాలని ప్రజల సాక్షిగా విమర్శలు చెయ్యటానికి చంద్రబాబు వేసిన రాజకీయ ప్లాన్ అని రాజకీయ మేథావులు అంటున్నారు. రాష్ట్రం రావణ కష్టంలా కాలిపోతున్న సమయంలో చంద్రబాబు ఆస్తులు వివరాలను బయటపెట్టాడు అంటే.. దాని వెనుక ఉన్న మర్మమం ఇదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏమైన చంద్రబాబు రెండుకళ్ల సిద్దాంతాన్ని నమ్మిన వ్యక్తి కాబట్టి, చీకట్లో ఏ సిద్దాంతాన్ని అవలంబిస్తాడో ఆయనకే తెలియలి. అంటే ఢిల్లీకి వెళ్లి చీకట్లో చిదంబరంతో చంద్రబాబు మంతనాలు జరుపుతాడని వైసీపీ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more