ఆశగా ఎదురు చూసిన వారికి నిరాశ మిలిగింది. నిరాశ తో కుంగిపోతూ జైలు వైపు అడుగులు వేయటం జరిగింది. కుటుంబ సభ్యుల కంట్లో కన్నీరు, అభిమానుల మనస్సుల్లో తడిఆరాని బాధ, ఆ బాధను బయటకు చెప్పులేని ఓ కన్నతల్లి . ఇంటికి పెద్ద దిక్కు అయిన భర్త లేడు, ఉన్న కొడుకు కళ్ల ముందు కనిపించకుండా నాలుగు గోడల మధ్య బంధి అయ్యాడు . దెబ్బ మీద దెబ్బ ఆ కుటుంబానికి తగులుతూనే ఉంది. అమ్మ నాన్న ఎప్పుడు వస్తాడని అడిగే పిల్లలకు ఆ తల్లి పెట్టే కన్నీళ్లను ఎవరు ఆపగలరు చెప్పుండి. రాష్ట్రానికి ముఖ్య నేత వ్యవహరించిన నాయకుడు అకల మరణానికి రాష్ట్రా ప్రజలు తల్లడిల్లిపోయారు.. అభిమాన నాయకుడు కోసం కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. వారి కోసం రాష్ట్రంలో మొదట ఓదార్పు యాత్ర చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి మరణాన్ని చూసి, విని తట్టుకోలేక, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని , ఆ కుటుంబాలకు ఆసర లేకుండా వెళ్లిపోయారు.
అలాంటి కుటుంబాలను ఓదార్చటం కోసం వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఎన్నో రాజకీయ విమర్శలు, అడ్డంకులు, మద్య కొన్ని రోజులు పాటు ఓదార్పు యాత్ర సాగింది. సడన్ ఓదార్పు యాత్ర కు సిబిఐ వారు చెక్ పెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఓదార్పు ఆగిపోయి., పాదయాత్ర మొదలైంది. పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ఒక్కటే పశ్న ఎదురవు తుంది. జగనన్న ఎప్పుడు బయటకు వస్తాడు? వైఎస్ అభిమాని ప్రతి ఒక్కరి నోట నుండి వచ్చే ప్రశ్న ఇదే. ఆ ప్రశ్నకు సమాధానం ఒక్కటే.. ‘‘జగనన్న వస్తాడు.. రాజన్న రాజ్యం తెస్తాడు ’’ అంటూ చెబుతూ, వైఎస్ అభిమానులను ఓదార్చుతూ ముందుకు పోతుంది. అయితే నిన్నటితో జగన్ బెయిల్ రాదని రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది.. జగన్ బయటకు రావటం ఇక కష్టమేనని వైఎస్ అభిమానులు చెప్పుకుంటున్నారు. జగన్ బెయిల్ రాదని తెలిసిన వెంటనే పార్టీ నాయకుల్లో పెద్ద అలజడి మొదలైంది.
జగన్ బయటకు రాకపోతే 2014 ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏమిటి అనే పశ్న సీనియర్ నాయకులను వేధిస్తుంది. సీనియర్ పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షరాలు వైఎస్ విజయమ్మ సుదీర్ఘ చర్చలు జరిపి, ఒక విషయానికి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర ప్రజల్లో ఉన్న అభిమానం తగ్గిపోకుండా , పార్టీ నాయకులు గట్టి చర్యలు తీసుకోవాలి. పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపాలి? అంటే ఒక్కటే మార్గం. మళ్లీ ఓదార్పు యాత్రను కోనసాగించాలి. వైఎస్ విజయమ్మ ఆద్వర్యంలో తన కోడుకు కోసం, రాష్ట్ర ప్రజల కోసం, పార్టీ కోసం, వైఎస్ అభిమానుల కోసం ఓదార్పు యాత్ర చెయ్యాలని పార్టీ వర్గాలు చూసించాయి . వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ భార్య, భారతి, షర్మిల ముగ్గురు కలిసి రాబోయో ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకోని రాష్ట్రంలో ఓదార్పు-2 యాత్రను ప్రారంబిస్తే, పార్టీకి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.. త్వరలో ఓదార్పు-2 మొదలవుతుందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more