ఈ రోజుల్లో కుటుంబం మొత్తం కష్టపడితే గానీ జీవితం ముందుకు సాగదాయే. పేద, మధ్యతరగతి జీవితాల్లో జరుగుతున్నపరిణామాలు. కానీ రాజకీయ కుటుంబాలు కూడా ఈ సూత్రానే పాటిస్తున్నాయి. రాజకీయ పదవుల కోసం, రాజకీయ అధికారం కోసం, కొన్ని కుటుంబాలు రాజకీయంలోకి వలస వెళ్లుతున్నాయి. రాజకీయ అధికారం కోసం కుంటుంలోని అందరు కష్టపడాలి. రాజకీయ పదవులను సమానంగా పంచుకోవాలి అనే నినాదంతో, పాదయాత్రలు, దీక్షాలు, రాజకీయ చర్యలు చేస్తున్నాయి కొన్ని రాజకీయ కుటుంబాలు. ముఖ్యంగా మూడు కుటుంబాలు మన రాజకీయ తెర మీద కనిపిస్తున్నాయి. మొదటిగా నారా వారి కుటుంబం, రెండు వైఎస్ఆర్ కుటుంబం, మూడు కల్వకుంట్ల చంద్రశేఖర్ (కేసిఆర్) కుటుంబం. ఈ మూడు కుటుంబాల నుండి ముగ్గురు మొనగాళ్లు రాజకీయల్లోకి అడుగు పెట్టారు. చంద్రబాబు కొడుకు లోకేష్ బాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్ , కేసిఆర్ కొడుకు తారక రామారావు.
ఈ ముగ్గురులో ఇప్పటికే రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు. ఒక ఎంపీగాను, మరొకరు ఎమ్మెల్యేగా రాష్ట్రంలో హల్ చల్ చేస్తున్నారు. కొడుకులతో పాటు కూతుర్లుకూడా రాజకీయ ప్రవేశానికి భారీగా ఫోస్టర్లు తయారు చేసుకుంటున్నారు. చంద్రబాబుకు కూతురు లేదు కాబట్టి , ఆయన కోడలు బ్రహ్మణి రాజకీయ ప్రవేశానికి సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నా విషయం తెలిసిందే. ఇక కేసిఆర్ కుటుంబం నుంచి ఆయన కూతురు కవిత ఇప్పటికే తన సొంత ఇమేజ్ సంపాదించుకొని.. రాబోయే ఎన్నికలకు సిద్దంగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుల భార్యలు రాజకీయల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటి వరకు భర్త తరువాత భార్య రావటం అనవాయితీగా వస్తుంది. చంద్రబాబుకు పూర్తి మద్దతు తెలుపుతూ. బాబు పాదయాత్రలో అప్పుడప్పుడు హల్ చల్ చేసిన భువనేశ్వరి. తన భర్త అధికారం కోసం పడుతున్న కష్టాల్లో ఆమె కూడా సమానంగా పంచుకుంటుంది. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై టీడీపి సంతకాల సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే అందులో భాగంగా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పాల్గొని .. ఆమె సంతకం చేశారు. అంతేకాకుండా సంతకాల సేకరణ బాధ్యతలు భువనేశ్వరి తీసుకున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇలా బాబు కు అధికారం రావాలని కుటుంబం మొత్తం కష్టపడుతుందని .. సీనియర్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇకపోతే.. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వైఎస్ జగన్ కు రాజకీయ అధికారం రావాలని .. వైఎస్ఆర్ భార్య ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, దీక్షలు , ఉద్యమాలు, ప్రజా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. అన్న కు అధికారం రావాలని కోరుతూ .. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల. ఇక అప్పుడప్పుడు .. నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. , తన సొంత మీడియా ద్వారా తన భర్తకు అన్యాయం జరిగింది, మా కుటుంబం పై కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని, పత్రికల్లో ఆర్టికల్స్ ప్రచురించి ప్రజలకు తెలియజేస్తున్న ..వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి. షర్మిల, విజయమ్మల కంటే వైఎస్ భారతికే రాజకీయాల మీద పట్టు ఎక్కువుగా ఉందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.
ఇక మిగిలింది టిఆర్ఎస్ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు (కేసిఆర్) భార్య శోభ. ఈమె ఇప్పటి వరకు ఏ రాజకీయ వేదిక మీద కనిపించలేదు. కానీ తెలంగాణ కోసం కొన్ని ఉద్యమాల్లో పాల్గొన్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వస్తే మాత్రం కేసిఆర్ భార్య శోభ కూడా .. రాజకీయ నాయకురాలు అయిన ఆశ్చర్యం లేదని రాజకీయ మేథావులు అంటున్నారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందని సూత్రాన్ని మన రాజకీయ నాయకులు పాటిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాజకీయ నాయకుల భార్యలు, కూతుర్లు, కొడుకులు, కోడళ్లు, బందువులు పోటీ చేస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more