Cm kiran kumar reddy on power issue

cm kiran kumar reddy, congress party, power charges hike, congress party leaders, tdp, yscrp, botsa satyanarayana, tdp leaders,

cm kiran kumar reddy on power issue

కిరణ్ గారి అతి తెలివి- మాడిపోయిన రాజకీయ ముఖాలు

Posted: 04/06/2013 12:24 PM IST
Cm kiran kumar reddy on power issue

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  రాజకీయల్లో బాగా ముదిరిపోయారు. ఏ మంత్రికి ఎలా కిక్ ఇవ్వాలో, ఏ ఎమ్మెల్యేకు ఎలా ఖంగు తినిపించాలో, మీడియాను ఎలా వాడుకువాలో అని నేర్చుకున్నారు. మొదట్లో ముఖ్యమంత్రి మీద ఎన్ని విమర్శలు వచ్చిన వాటిని పట్టించుకోకుండా.. యువ కిరణాలు, ఇందిరమ్మ బాటలతో ముందుకు సాగిపోయారు. కాలం కరిగిపోతున్న కొద్ది,  కిరణ్ గారి కిరణాలు వేడెక్కి ప్రత్యర్థులకు పట్టపగలే చుక్కులు చూపించే విధంగా మారాయి. పబ్లిసిటీ కోసం పత్రికలను, మీడియాను  పవిత్రంగా వాడుకుంటూ, పార్టీలోని ముఖ్యనేతలకు చెక్ పెట్టేశారు. మొదట్లో ఒంటికాలుమీద ఎగిరిపడిన  పీసీసీ  అధ్యక్షుడు  బొత్స సత్యనారాయణకు మద్యం  లింకు పెట్టి .. నోరు మూయించారు.  ముఖ్యమంత్రికి వ్యతిరేక వర్గం ఇప్పటికే  వైఎస్ జగన్ పార్టీలో చేరి .. మా మీద వేటు వేయాండి అని స్పీకర్ కు లేఖలు రాయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది.  తెలంగాణ సమస్యతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో సమస్య వచ్చిపడింది. కాంగ్రెస్ పార్టీ నుండి 9 మంది ఎమ్మెల్యేలు వేటు వేయమాని స్పీకరు ను కోరటంతో.. కాంగ్రెస్ కు పెద్ద కష్టం వచ్చిపడింది. టిడిపి ఎమ్మెల్యే లు వేటు వేయమని లేఖలు పంపించారు.

ఇప్పుడు వీరి పై వేటు వేస్తే  .. త్వరలో ఉప ఎన్నికలు  జరపాలి. కానీ ఇటూ కాంగ్రెస్ పార్టీ గానీ, అటూ టీడీపీ గానీ ..ఉప ఎన్నికలను ఎదుర్కోనే పరిస్థితిలేవని సీనియర్ నాయకులు అంటున్నారు.  కొంతకాలం వారిమీద వేటు వేయటం పై కాలం గడుపుదామేనే ఆలోచనలో ముఖ్యమంత్రి కిరణ్ ఉన్నట్లు  కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు.  అయితే ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి  రాష్ట్ర ప్రజల పై అధిక భారం విద్యుత్ ఛార్జీ పెంచిన విషయం తెలిసిందే. విద్యుద్ చార్జీలు తగ్గించాలని ప్రతిపక్షపార్టీలు దీక్షలు చేస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు పై రాష్ట్ర ప్రజల నుండి వ్యతిరేకత రావటంతో  అందుకు  విరుగుడు కనిపెట్టాడు సిఎం కిరణ్. పీసీసీ అధ్యక్షుడు  బొత్స  సత్యనారాయణ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి , కాంగ్రెస్ మంత్రులు కలిసి అతి తెలివిగా విద్యుత్ ఛార్జీలు తగ్గించారని  టీడీపీ నాయకులు అంటున్నారు. 200ల యూనిట్లు వాడుకున్నవారికి .. పాత ధరలు వర్తిస్తాయి. 200ల యూనిట్లు కంటే ఎక్కువ వాడుకుంటే..అధిక ధర చెల్లించాలని  సీఎం కిరణ్ కుమార్ చెప్పటం జరిగింది. అయితే ఇక్కడే  కిరణ్ గారి అతితెలివి బయపడింది.  200ల యూనిట్లు వరకు ధర తగ్గించటం వల్ల రాష్ట్రంలో ఉన్న పేదవారికి బాగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రజల అనుగుణంగానే ధరలు తగ్గించటం జరిగిందని  కాంగ్రెస్ నాయకులు రెండు హస్తలతో  చప్పట్లు కొట్టుకున్నారు.

కానీ, అసలే వేసవి కాలం కాబట్టి ఎలా వాడుకున్న 200ల యూనిట్లు దాటిపోతుందని ..సీఎంకు ముందే తెలుసు.  ఇక కరెంట్ చార్జీల పెంపు విషయం పై దీక్షలు, ధర్నాలు చేస్తే.. అది వ్యాపారుస్తుల కోసమే అవుతుందని సిఎం కిరణ్ తెలివిగా చెప్పి .. తప్పించుకున్నారు.  రాష్ట్రంలో  ఉన్న పేద, మద్యతరగతి కుటుంబాలకు  మేము ఎంతో మేలు చేస్తున్నామని చెప్పే ముఖ్యమంత్రి తెలివి ఇదేనని టీడీపీ నాయకులు అంటున్నారు.  ‘‘అరచేతిలో ఐస్ ముక్క పెట్టి .. ముంజేతిని చూడమన్నట్లు’’ గా ఉందని  సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.  ‘‘కుడిచెత్తో పెట్టి... ఎడమ చెత్తో  వాతపెట్టినట్లు’’ గా ఉందని  ఎర్రజెండా నాయకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more