బెజవాడ రాజకీయలకు పెట్టింది పేరు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ జెండాలన్నీ బెజవాడలోనే కలహాల కాపురం చేస్తుంటాయి. బెజవాడ రాజకీయలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. చోట నాయకుల నుండి బడా నాయకుల వరకు అందరు అధికారం కోసం పరుగులు తీసేవారే. నిత్యం పగతో రగిలిపోతుంటాయి బెజవాడ రాజకీయాలు. ప్రత్యర్థులపై రాజకీయం పగ తీర్చుకోవటానికి ఎన్నికలు అనే ఆయుధం రాజకీయ నాయకులకు బాగా ఉపయోగపడుతుంది. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది బెజవాడలో (విజయవాడ) రాజకీయం వేడేక్కుతుంది. బెజవాడలో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య వేసవి యుద్దం నడుస్తుంది. ఈ రెండు పార్టీలు బెజవాడ సెంటర్లో ఉన్న ప్లెక్సీల కోసం కయ్యానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీల నాయకులు వంగవీటి రాధాక్రిష్ణ, దేవినేని నెహ్రుల మధ్య ప్లెక్సీ యుద్దం మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న విషయం తెలిసిందే. షర్మిల పాదయాత్రలో వంగవీటి రాధా క్రిష్ణ యూత్ పేరుతో బెజవాడలోని పడమట సెంటర్లో ఏర్పాటు చేయటం జరిగింది. అందులో వంగవీటి రాధా క్రిష్ణ యూత్ పేరుతో ‘‘ఇప్పుడే ఆట మొదలవుతుంది’’ అని ప్లెక్సీ ఏర్పాటు చేయటంతో.. కాంగ్రెస్ నాయకుడైన దేవినేని నెహ్రు యూత్ కూడా మరో ప్లేక్సీ ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఆ ప్లేక్సీ లో ‘‘ మేము ఆడేందుకు సిద్దమే’’ అని ప్లెక్సీ పెట్టడంతో.. రెండు పార్టీల అనుచరుల మద్య మాటల యుద్దం మొదలైంది. ఈ విషయంతో తెలుసుకున్న వంగవీటి రాధా క్రిష్ణ కు చెందిన మరో గ్రూప్ .. వెంటనే అదే సెంటర్లో మరో ప్లెక్సీ ఏర్పాటు చేయటం జరిగింది. ఆ ప్లెక్సీలో ‘‘ మేము పిల్లలతో ఆడం’’ అని రాసి ఉండటంతో.. రెండు పార్టీల కార్యకర్తలు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేవినేని నెహ్రూ అప్పటికే విజయవాడా ఈస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధా కో ఆర్టినేటర్ ఏర్పాటు చేశారు. అయితే బెజవాడలో బలమైన నాయకుల మధ్య పోటీ తీవ్రత పెరిగింది. ఈ పోటీ తీవ్రతో బెజవాడలో ఎలాంటి సంఘటనలో జరుగుతాయోనని, స్థానిక ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్లెక్సీ విషయంలోనే రెండు పార్టీ నాయకులు కత్తులు దూసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీ నాయకుల దూకుడు గమనించిన పోలీసులు రంగలోకి దిగి.. కార్పొరేషన్ సిబ్బంది చేత ఇరు పార్టీల నాయకులు కట్టిన ఫ్లెక్సీ లను తొలగించటం జరిగింది. అయిన రెండు పార్టీ నాయకుల మధ్య పగ నివూరుగప్పిన నిప్పులు ఉందని, ఎప్పుడు ఏం జరుగుతుందో, తెలియాక బెజవాడ ప్రజలు భయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more