కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో కొన్ని రాజకీయ పార్టీలకు ఇప్పటికే అర్థమై ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద కత్తులు, కారాలు, మిరియాలు నూరిన వారికి ఏం జరుగుతుందో మన కళ్లముందే తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో కయ్యానికి కాలుదువ్విని .. వైఎస్ జగన్ పరిస్థితి ఏమిటి? ఇప్పటి వరకు బెయిల్ రాకుండా.. చంచల్ గూడ జైల్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే కాంగ్రెస్ పార్టీతో కటిఫ్ చేసుకున్న ఎంఐఎం సోదరులకు పట్టపగలే చుక్కలు చూపింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి నేతలకు వరుస అరెస్టులతో అన్నదమ్ములకు గడ్డం గీసుకొనే సమయం కూడా చిక్కకుండా ఉక్కిరిబిక్కిరి చేసి... చివరకు తన గుప్పిట్లో పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అమ్మ దర్శనం తరువాతనే ఆ పార్టీకి అరెస్టు తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాస్తా ఊపిరి పీల్చుకుంటున్నారు ఆ సోదలిద్దరు. అయితే ఇప్పుడు ఆపార్టీతోనే తెలుగుదేశం పార్టీకి తెరదించేప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్తో విభేదాలు చెలరేగిన నేపథ్యలో మజ్లిస్ పార్టీ టీడీపీకి మద్దతు పలుకుతుందని అంతా భావించారు. లేదా... టీడీపీ మద్దతుతో తానే ఓ అభ్యర్థినిని నిలుపుతుందనే ప్రచారం కూడా జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపడంపై టీడీపీ, మజ్లిస్ మధ్య కొన్నాళ్లు చర్చలు కూడా జరిగాయి. కానీ... అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంఎస్ ప్రభాకర్ను రెండో సారి ఎంఎల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో మజ్లిస్-తెలుగుదేశం పార్టీల మధ్య చర్చలకు తెరపడింది.
గతంలో మజ్లిస్ అభ్యర్థిగా సయ్యద్ అమీనుల్ హస్సన్ జాఫ్రీ ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు... ప్రభాకర్కు భవిష్యత్తులో తమ మద్దతు ఉంటుందని అసదుద్దీన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు కాంగ్రెస్ వ్యవహారం చెడినప్పటికీ... జీహెచ్ఎంసీ మేయర్ స్థానంలో మాత్రం పరస్పర ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఎంఐఎం నేత కొనసాగుతున్నారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎంలకు ఉన్న బలం దృష్ట్యా ఇద్దరు ఎమ్మెల్సీలు ఎన్నికయ్యే అవకాశముంది. గతంలో ఎంఐఎం తరఫున సయ్యద్ జాఫ్రీ ఎంపిక అయినందున... ఇప్పుడు ప్రభాకర్కు మద్దతు పలకడమే సమంజసమని అసదుద్దీన్ భావించినట్లు తెలిసింది. దీంతోపాటు భవిష్యత్ పరిణామాలు కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు సమాచారం. ఏదైతేనేం... ఈ ఎన్నికల్లో ఎంఐఎం తన అభ్యర్థిని నిలపలేదు. ఇంకెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖరారైపోయింది. దీంతో తెలుగుదేశం ఎంఐఎం పార్టీలు బలపడే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆడిన డబుల్ గేమ్ లో తెలుగుదేశం పార్టీకి పట్టపగలే చుక్కలు కనిపించినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఎంఐఎం పార్టీ నాయకుల నోట టీడిపి పదం రాకుండా చేసిందని కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో చెప్పుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more