2014 తరువాత మన దేశ ప్రధాని ఎవరు? అంటే అందరు ఒకటే మాట చెబుతున్నారు. సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ 2014 తరువాత దేశ ప్రధాని అని కాంగ్రెస్ పెద్దలు , దేశ ప్రజలు అంటున్నారు. కానీ మన్మోహన్ తరువాత ప్రధాని రాహుల్ గాంధీ కాదనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అంటున్నారు. రాహుల్ గాంధీకి ప్రధాని మంత్రి చేసే అర్హత, అనుభవం లేదని ఆయన అంటున్నారు. ఆయన చీకట్లో రాజకీయం చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆయన ప్రధాని మంత్రి పదవి మీద కన్నేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతనికి అడ్డుగా ఉన్న ప్రణబ్ ముఖర్జీని అడ్డు తొలగించినట్లు తెలుస్తోంది. అంటే ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి పదవి రావటంతో .. ప్రధాన మంత్రి పోటీ నుండి ఒకరు తొలిగినట్లుగా అతను భావిస్తున్నాడట. ఇప్పుటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మద్య చిచ్చు పెట్టిన అరవ మంత్రి పేరు సంపాదించుకున్నాడు. ఆయన పెట్టిన చిచ్చుతో రాష్ట్రంలో ఆరని మంటలు మండుతునే ఉన్నాయి. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు వయసైపోయింది కాబట్టి ప్రధాని మంత్రి రేసులో ఇతను నిలబడినట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటి నుండి చీకటి రాజకీయాలు చేస్తున్నాడని కాంగ్రెస్ పెద్దలు అంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా? మన ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం. ఇప్పుడు చిదంబరం మనసు ప్రదాన మంత్రి పదవి పై పడిందట. అందుకు అనుగుణంగా దారులు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీ బీజేపి నుండి ప్రధాని మంత్రి రేసులో ఎవరు ఉన్నారు అంటే.. ఎక్కువుగా నరేంద్ర మోడీ పేరు వినిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కి వస్తే ..రాహుల్ గాంధీ పేరు ఖాయం అయ్యింది? కానీ కొంత మంది మాత్రం మరోలా చెబుతున్నారు.
ఒక వేళ బీజేపి ప్రధాని రేసులోకి మోడీ తెస్తే.. కాంగ్రెస్ పార్టీ నుండి చిదంబరం అయితే కరెక్ట్ అని చెప్పే కాంగ్రెస్ నాయకుల గొంతు వినబడుతుంది ఢిల్లీ. అలా ఎందుకు అంటే.. మోడీ ని ఎదుర్కొనే సత్తా రాహుల్ గాంధీకి లేదని వారు అంటున్నారు. చిదంబరం ఇప్పటి నుండి తన కార్యచరణ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2014 నాటికి మన్మోహన్ సింగ్ కు 80 సంవత్సరాలు దాటిపోతాయాని, ప్రధాని మంత్రి పదవి చేపట్టే స్థితికి రాహుల్ గాంధీ ఎదగలేదని ఆ ద ఎకనమిస్ట్ అనే లండన్ పత్రికలో విశ్లేషించింది. దీంతో కాంగ్రెస్ నాయకులు మద్య అలజడి రేగింది. దీని వెనుక చిదంబరం హస్తం ఉందని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని మంత్రి పదవి రేసు లో చిదంబరం ఉన్నాడని కాంగ్రెస్ పార్టీకి అర్థం అయిందట. అందువలన రాహుల్ గాంధీ కి పోటీగా చిదంబరం ఉన్నాడనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు మీడియాతో 2014 తరువాత రాహుల్ గాంధీ మా ప్రధాని అని చెప్పటం జరిగింది. కానీ చిదంబరం మాత్రం రాహుల్ గాంధీని ప్రధాని మంత్రి పదవి అర్హుడు కాదని చెప్పే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చిదంబరం గారి చిరు ఏమిటో బయట పడిందని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more