ఏంటీ.. చిరంజీవి సీటులో వైఎస్ విజయమ్మ ? ఇది జరుగుతుందా? అంటే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ విలీనం చేశారా? అనే అనుమానాలు వస్తాయి . కానీ ఇక్కడ జరిగేది మరొకటి? ఈనెల 17 నుండి శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదలైవుతున్న సందర్భంలో .. ఈ మేటర్ తెరపైకి వచ్చింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత వైఎస్ విజయమ్మకు ఇప్పుడు సీటు కేటాయించే విషయంలో కాంగ్రెస్ కొత్త ప్రయత్నాలు చేస్తుంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు గా చిరంజీవి ఉన్న సమయంలో వెనక వరుసలో కూర్చోనే వారు. అయితే ఆయన పార్టీ ని కాంగ్రెస్ విలీనం చేయటంతో అధికార పార్టీ సభ్యులతో పాటు ఆయన కు ప్రత్యేక స్థానం కల్పించారు. ఆయన ముందు వరుసలో కూర్చోనే వారు. ఇప్పుడు ఆయన రాజ్యసభకు వెళ్లిపోవడంతో.. ఆ సీటు ఖాళీగా మిగిలిపోయింది. అయితే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే.
గతంలో వైఎస్ విజయమ్మతో పాటు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆ పార్టీ సంఖ్యా బలం 17కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే టీఆర్ ఎస్ తో పోటీగా వైకాపా సంఖ్య బలం పెరగటంతో.. సభలో సీట్లు కేటాయించే విధానం ఆసక్తికరంగా మారింది. సభలో టీఆర్ ఎస్ పార్టీ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ కు ముందు వరుసలో స్థానం కేటాయించారు. ఇప్పుడు వైఎస్ విజయమ్మకు కూడా ఆ సూత్రాన్ని పాటించలనే ఉద్దేశంలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆ సూత్రం పాటిస్తే.. వైఎస్ విజయమ్మకు చిరంజీవి కూర్చున్న సీటు కేటాయించే అవకాశం ఉన్నట్లు ..కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంటే మరొరకంగా.. వైకాపా కూడా కాంగ్రెస్ లో విలీనం అయ్యే పార్టీగా సంకేతాలుగా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. వైఎస్ విజయమ్మ స్థానం పై ఆ పార్టీ నాయకులు ఏం అంటారో చూడాలి??
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more