ఢిల్లీలో ఏం జరిగింది? కాంగ్రెస్ పెద్దలు సిఎం కిరణ్ కు ఏం హామీ ఇచ్చారు? ధర్మాన రాజీనామా విషయాన్ని సిఎం కిరణ్ కే వదిలేశారా? పిసిసి చీఫ్ ను మార్చనున్నారా? ఇవీ మంత్రులు, కాంగ్రెస్ నేతలను తొలుస్తున్న ప్రశ్నలు. అందుకే తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు సిఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు. అయితే ఆయన గుంభనంగా వ్యవహరించడంతో.. తమ సందేహాలు నివృత్తి కాక.. నేతలు నిరుత్సాహపడ్డారు. సిఎంను కలిసొచ్చిన వారు.. ఎవరికి తోచిన భాష్యాన్ని వారు చెప్పుకుంటున్నారు.ఇంకా లోతుగా వెళితే..
కాంగ్రెస్ హైకమాండ్ మదిలో ఏముంది....? రాష్ర్ట కాంగ్రెస్ నాయకత్వాన్ని మారుస్తుందా..? లేక పాక్షిక మార్పులతో సరిపెడుతుందా... ; కిరణ్ కుమార్ రెడ్డితో అధిష్ఠానం ఏం చర్చించింది....? ఆయనకు పూర్తి స్వేచ్చ నిచ్చిందా...? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరక్క సతమతమవుతున్న నేతలు.. ఏకంగా సీఎంనే కలిసి.. వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్కంఠను ఎదుర్కొంటున్న మంత్రులు.. సిఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. మంత్రులు గల్లా అరుణ, గంటా శ్రీనివాస్, టిజీ వెంకటేష్, శత్రుచర్ల, రాంరెడ్డి వెంకటరెడ్డి, పార్థసారథి తదితరులు.. సిఎంను కలిసి ఢిల్లీ విశేషాలను ఆరా తీశారు.
అయితే కిరణ్ కుమార్ రెడ్డి.. ఎవరితోనూ ఏమీ చెప్పకుండా గుంభనంగా వ్యవహరించినట్లు సమాచారం. తనను కలిసిన మంత్రులకు.. ఢిల్లీ విశేషాలు ప్రస్తావించే అవకాశం సిఎం ఇవ్వలేదని తెలుస్తోంది. ఆయనే స్వయంగా ఈ అంశాలు ప్రస్తావిస్తారని భావించి వెళ్లిన మంత్రులు.. సిఎం వైఖరితో నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో వారంతా సిఎంను మర్యాదపూర్వకంగా పలకరించి వెనుదిరిగారు. తనను కలిసిన ప్రముఖుల వద్ద.. మంత్రి ధర్మాన రాజీనామా అంశాన్ని కూడా సిఎం ప్రస్తావించలేదు. సిఎం ముఖంలో కొంత నిరాశ కనిపించిందని గతంలో ఉన్నంత ఉత్సాహం ఆయనలో లేదని చాలా మంది మంత్రులు ప్రైవేటు చర్చల్లో చెబుతున్నారు. మీడియా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చెప్పాలనుకున్న అంశానికే పరిమితమయ్యారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలను పట్టించుకోకుండానే వెళ్లిపొయ్యారు. దీంతో ఆయనలో కొంత మార్పు కన్పిస్తుందని... డిల్లీలో కిరణ్ కు ప్రతికూల వాతావరణం ఉందని కొందరు నేతలు భాష్యం చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారాన్ని మరికొందరు మంత్రులు ఖండిస్తున్నారు. గతంలో కంటే ఆయనలో ఉత్సాహం రెట్టింపయిందని...అందుకే వెంటనే పాలన విషయాలపై దృష్టి పెట్టారని చెపుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. నాయకత్వ మార్పు అంశాన్నీ.. రాష్ట్ర విభజనతో ముడిపెట్టారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ అధిష్ఠానం, పార్టీతో పాటు.. ప్రభుత్వ పటిష్టతపైనా దృష్టి పెట్టిందని చెబుతున్నారు. కొందరు నాయకులైతే అసలు నాయకత్వ మార్పు ఉండబోదనీ వ్యాఖ్యానిస్తున్నారు.
అటు.. సిఎం వైరి శిబిరం జైపాల్ రెడ్డి ఇంట్లో భేటీ అయింది. ఇందులో మంత్రులు డిఎల్, జానారెడ్డి పాల్గొన్నారు. రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితులు ఢిల్లీ పెద్దల వ్యూహాలు ఎలా ఉంటాయనే దానిపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తానికి.. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన నేతలు ఎలాంటి సంకేతాలూ వెలిబుచ్చక పోవడంతో.. అక్కడేమి జరిగింది..? ఇక్కడ రాష్ట్రంలో ఏమి జరగబోతోంది...? అన్న ఉత్కంఠ రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో క్షణక్షణానికీ ఎక్కువవుతోంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more