సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో ఐక్యత లేదని, నిర్మాతల మండలిలో పనిలేని వాళ్లే ఎక్కువగా ఉన్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమలో అంతా కలిసున్నామనే వాదనలో నిజం లేదని, అంతా అబద్ధమని, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పరిశ్రమ తయారైందని మోహన్ బాబు అంటున్నారు. పైరసీ విషయంలో నిర్మాలంతా ఒక్కతాటిపై లేరని, ఇక్కడ న్యాయం చేసే వాళ్లు, కనీసం పట్టించుకునే వారు కూడా లేరన్నారు. గతంలో విష్ణు నటించిన సినిమా పైరసీ రెడ్ హాండెడ్ గా పట్టుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండి పడ్డారు. సినీ పరిశ్రమలో ఐక్యత ఉందనే విషయం అవాస్తవమని, అలా అనే వాళ్లు తన ముందు వచ్చి చెబితే అన్ని విషయాలు చెబుతానన్నారు. మోహన్ బాబు వ్యాఖ్యలతో పరిశ్రమలోని డొల్లతనం బయట పడినట్లయింది. పరిశ్రమలో వర్గ పోరు నడుస్తుందని...ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలకు మోహన్ బాబు మాటలు బలం చేకూరినట్లయింది.
ప్రముఖ నటుడు మోహన్బాబు కుమార్తె లక్ష్మీప్రసన్నకు సినిమాలు వద్దని చెప్పానని మీడియాతో అన్నారు. ఆమె నిర్మాతగా మారి 'ఝమ్మంది నాదం' చిత్రాన్ని నిర్మించి విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు 'ఊ కొడతారా... ఉలిక్కి పడతారా' చిత్రాన్ని తీసింది. మరోవైపు నటిగా, టి.వి. టాక్ షో నిర్వాహకురాలిగా బిజీగా ఉంది. నిజానికి లక్ష్మీప్రసన్నను సినిమా రంగం వైపు వద్దని తనకున్న ఇతర వ్యాపారాల వైపు దృష్టి పెట్టాల్సిందిగా సూచించానని ఆయన అన్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ..."నేటి పరిస్థితుల్లో సినిమా తీయడం అంత సులువు కాదు. క్రమశిక్షణా రాహిత్యం కనిపిస్తుంది. కొందరు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా తీయవద్దని తనకున్న విద్యా సంస్థల బాధ్యతలను చేపట్టాల్సిందిగా మోహన్బాబు చెప్పారు. అయితే లక్ష్మీప్రసన్న సినిమా రంగానికి రావడానికే ఆసక్తి చూపింది. అమెరికాలో షార్ట్ ఫిలిమ్స్ తీయడంలో శిక్షణ పొందింది. దాంతో తన దృష్టి అంతా సినిమాలపైనే నిలిపింది. తన తాతగారు పేరు మీద మంచు ఎంటర్టైన్మెంట్ సంస్థను నెలకొల్పింది" అన్నారు.
అలాగే "ఆమె సోదరులు విష్ణు, మనోజ్ పూర్తి సహాయ, సహకారాలను అందిస్తూ ప్రోత్సహించారు. లక్ష్మీ సొంతంగా సంస్థను నెలకొల్పిన విషయమే నాకు తెలియదు. తెలిశాక ఈ రంగం పట్ల ఆమెకున్న ఉత్సాహాన్ని ప్రోత్సహించాను. తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాను. 'ఊ కొడతారా... ఉలిక్కి పడతారా' షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకటి, రెండు సార్లు మినహా సెట్కు వెళ్లింది లేదు. అయితే సినిమా తొలి కాపీ చూశాక విజయంపై నమ్మకం ఏర్పడింది" అని మోహన్బాబు చెప్పారు. ఇక లక్ష్మి ప్రసన్న ఈ చిత్రం విజయం సాధించిందని అన్నారు. అలాగే బాలకృష్ణ పోషించిన పాత్ర సినిమాలో బాగా ఎలివేట్ అయ్యింది. "అందరూ మా నాన్నగారు మోహన్ బాబు ని ఈ సినిమాలో ఆ పాత్రకు తీసుకుంటామనుకున్నారు. కానీ బాలకృష్ణ ని తీసుకోవటం అందరకీ ఆశ్చర్యమనిపించింది. ఆ ఆశ్చర్యపోయే ఫాక్టరే సినిమాకు క్రేజ్ తెచ్చింది" అన్నారామె.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more