బెయిల్ వ్యవహారంలో సస్పెండైన న్యాయమూర్తి పట్టాభి రామారావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పట్టాభిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు ఈయనకు సహకరించిన వారిపై కూడా సీబీఐ దృష్టిసారించింది. చలపతిరావు సోదరుడు శ్రీనివాసరావు ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది. ఇటు రౌడీ షీటర్ యాదగిరి ఇంట్లో సోదాలు జరిగాయి. మరోవైపు ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ జడ్జి చలపతిరావు అస్వస్తతతో కేర్ ఆస్పత్రిలో చేరారు.
ఇదిలా ఉండగా, గాలి బెయిల్ వ్యవహారంలో పాత్రలు, పాత్రధారులు, సూత్రధారుల ప్రమేయం తవ్వేకొద్దీ బయటపడుతోంది. జడ్జికి లంచం-గాలికి బెయిలు వ్యవహారంలో మొత్తం ఏడుగురి పాత్ర ఉందన్నది ప్రాథమిక నిర్ధారణ. ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన సీబీఐ-వారిపై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరినట్టు సమాచారం. పట్టాభి రామారావును సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయన కుమారుడు రవిచంద్రను కూడా ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవిచంద్ర హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అయితే రామారావు ఎలాంటి తప్పు చేయలేదని ఆయన కుటుంబసభ్యులు అంటున్నారు. ఇప్పటి వరకు సీబీఐ ఎవరినీ ప్రశ్నించలేదని చెబుతున్నారు. లాకర్లు తెరిచారని వస్తున్న కథనాలను ఖండించారు. సీబీఐ కేసు నమోదు చేయబోయే ఈ ఏడుగురి జాబితాలో రాయలసీమకు చెందిన మంత్రి ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. మరోవైపు తనపై వస్తోన్న ఆరోపణలను మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఖండించారు. ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.
రాయలసీమకు చెందిన మంత్రితో పాటు.. .జడ్జి పట్టాభిరామారావు, ఆయన కుమారుడు, పట్టాభికి స్నేహితుడైన మాజీ న్యాయమూర్తి చలపతిరావు, గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి, గాలి అనుచరుడు, కర్ణాటకలోని కంప్లి ఎమ్మెల్యే సురేశ్ బాబు, హైదరాబాద్ కు చెందిన రౌడీషీటర్ యాదగిరి వీరంతా ఈ కుట్రలో భాగస్వాములైనట్టు సీబీఐ వద్ద పక్కా ఆధారాలున్నాయి. వీరంతా గాలికి మేలు చేయడంలో దశలవారీగా విడతల వారీ సాయం చేసి ఉంటారన్నది సీబీఐ అనుమానం. వాస్తవానికి ఈ వ్యవహారం బయటపడకముందు నుంచే ఈ విషయంలో సీబీఐ రహస్యంగా దర్యాప్తు చేస్తోంది. వివిధ ప్రాంతాల్లో సోదాలను కొనసాగిస్తోంది. చిలకలూరిపేటలోని మాజీ న్యాయమూర్తి చలపతిరావు ఇంట్లో సీబీఐ సోదాలు చేపట్టింది. గాలి జనార్దనరెడ్డి కుంభకోణంలో చలపతిరావు ప్రమేయంపై ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. చలపతిరావు సోదరుడు శ్రీనివాసరావుని సీబీఐ ప్రశ్నించింది. డాక్యుమెంట్ రైటర్ శ్రీనివాసరావు, న్యాయవాది తారకరామ నివాసాల్లోనూ సోదాలు సాగుతున్నాయి.
రౌడీషీటర్ - యాదగిరిరావు ఇంట్లో తనిఖీలు, ఇంటరాగేషన్ కొనసాగాయి. ఇంట్లోని ఓ గదిలో యాదగిరిని కూర్చోబెట్టిన అధికారులు, ప్రశ్నల వర్షం కురిపించారు. గాలితో పరిచయం ఎలా ఏర్పడింది? జడ్జితో రాయబారం నెరిపిన వారిలో ఎవరెవరు ఉన్నారు? సూత్రధారి ఎవరు? డబ్బులు ఎక్కడినుంచి తీసుకొచ్చారు? జడ్జికి ఎవరిచ్చారు? డీల్ ఎక్కడ జరిగింది?'' మొదలైన ప్రశ్నలతో వారు ఆరా తీసినట్టు సమాచారం. మొత్తానికి గాలికి బెయిల్ ఇప్పించేందుకు గాలి అనుచరులు పదికోట్లు ఖర్చుపెట్టినట్టు తెలిసింది. బెయిల్ ఇవ్వడానికి ముందు ఒకసారి రూ.1.20 కోట్లు, మరోసారి రూ.1.40 లక్షలు, బెయిల్ ఇచ్చిన తర్వాత రూ.2.40 కోట్లు ఇలా మొత్తం మూడు విడతల్లో పట్టాభికి సొమ్ము ముట్టచెప్పి ఉంటారన్నది సీబీఐ అభియోగం.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more