ఇక ప్రభుత్వ సొమ్ము నేరుగా మీ ఖాతా లోకే జమచేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పేదవర్గాలకు వివిధ రూపాల్లో అందిస్తున్న సబ్సిడీలను నేరుగా సొమ్ము రూపేణ అందించేందుకు రంగం సిద్దమౌతోంది. కేంద్రం అమల్లోకి తీసుకువస్తున్న నగదు బదిలీ పథకం రాష్ట్రంలో జిల్లా నుంచే తొలిసారిగా మే నుంచి ప్రారంభం కానుంది. నగదు బదిలీ పథకం కింద పేద కుటుంబాలకు నేరుగా రాయితీ సొమ్మును వారి ఖాతాలో జమచేసే పక్రియకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నుంచి శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
కాగా, ఈ ఏర్పాట్లు పరిశీలించేందుకు కేంద్ర పరిశీలకుల బృందం ఈ నెల 28న మహేశ్వరంలో పర్యటించనుంది. ఇంతకు ముందే ఈ పథకం అమలుకోసం పైలెట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మహేశ్వరం మండలంలో ప్రారంభించిన తరువాత దశల వారీగా ఇతర ప్రాంతాలకు దీన్ని విస్తరిస్తారు. అలాగే సబ్సిడీ బియ్యం, ఎరువులు వంటి వాటికి కూడా ఇదే విధంగా నగదు బదిలీ కింద పేదలకు రాయితీలను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. తెల్లరేషన్కార్డుదారుల డేటాను ఆధార్ డేటాతో అనుసంధానం చేస్తారు. ఆధార్ డేటా ఆధారంగా ఇపుడు రేషన్ సరఫరా జరుగుతోంది. దీనివల్ల అధికారులు బోగస్ దారుల ఆటకట్టించటం ద్వారా సుమారు 15 శాతం రేషన్ మిగులు కనిపిస్తుందని సమాచారం. ఇక నగదు బదిలీ అమల్లోకి వస్తే మరింత మిగులు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఫలితంగా, కార్డుదారులు ఇక ముందు బహిరంగ మార్కెట్లో ఉన్న ధరనే చెల్లించి సరుకులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సరుకు కొన్న తరువాత సబ్సిడీ సొమ్ము లబ్ధిదారుని ఖాతాలో జమవుతుంది. దీంతో సరుకు అవసరం లేని కొందరు ముందే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపరు. దీనివల్ల ప్రతి నెలా కొంత కోటా మిగులుతుందని దీనివల్ల ప్రభుత్వానికి భారం తగ్గటమే కాక అక్రమార్కులకు దోచుకునే అవకాశం లేకుండా పోతుంది. ఈ పథకం ఆచరణలో ఎంతవరకూ సత్ఫలితాల నిస్తుందో చూడాలి.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more