సూరి హత్యకు ముందుగా ప్లాన్ చేసుకున్న భాను కిరణ్ కదలికలు ఇలా ఉన్నాయి. మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన తర్వాత ఎక్కడికైనా పారిపోయేందుకు నాలుగు లక్షల రూపాయలను ముందస్తుగా సిద్ధం చేసుకున్నాడు భాను కిరణ్. సూరిని గత ఏడాది జనవరి 3 యూసూఫ్గూడలోని నవోదయ కాలనీలో హత్య చేసిన తర్వాత భానుకిరణ్ తన గన్మెన్ మన్మో హన్సింగ్, శూలం సుబ్బయ్య, వెంకటహరిబాబు, బోయ వెంకట రమణతో కలిసి షోలాపూర్, పూణె, ముంబాయి మీదుగా ఢిల్లీలోని గుర్గావ్కు పారిపోయాడు. గుర్గావ్లోని శర్మ లాడ్జిలో కొంత కాలం తలదాచుకున్నాడు. భాను ఢిల్లీలో ఉన్నప్పుడు అతని అనుచరుడు మన్మోహన్సింగ్ పారిపోయాడని భాను తెలిపాడు.
అనంతరం మన్మోహన్సింగ్ను అతని స్వగ్రామంలో, ఆ తర్వాత సుబ్బయ్య, వెంకట హరిబాబు, బోయ వెంకటరమణను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరంతా ప్రస్తుతం జైలులో ఉన్నారు. మన్మోహన్సింగ్ అరెస్టు అయినట్లు తెలుసుకుని తనను కూడా అరెస్టు చేస్తారన్న భయంతో భాను వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయి రెండు మూడు రోజులకొక లాడ్జిల్లో బసచేసే వాడు. ఇంటర్నెట్ ద్వారా రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకునే వాడు.
రాష్ట్రాలు, ప్రాంతాలు మారుస్తూ భాను మధ్యప్రదేశ్లోని సివోని గ్రామానికి పారిపోయి ఈఏడాది జనవరి నుంచి అక్కడే ఉంటున్నాడు. అక్కడ గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాడు. టాటాస్కై డిజిటల్ టివి కనెక్షన్ తీసుకుని తెలుగు ఛానెళ్లు చూస్తూ ఇక్కడి విషయాలు తెలుసుకునేవాడు. ఒక్క మధ్యప్రదేశ్లోని సివోలి గ్రామంలో ఉన్నప్పుడు బినామీ పేర్లతో కొనుగోలు చేసిన సిమ్కార్డులను ఉపయోగించాడు. మిగితా ప్రాంతాల్లో భాను పబ్లిక్ ఫోన్లు వినియోగించేవాడు. సూరిని హత్య చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి పరారైన భాను ఢిల్లీలో కొన్నాళ్లు, ఆ తర్వాత మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గోవాల్లో తిరిగాడని పోలీసులు వెల్లడించారు.
ఓ బ్రోకర్కు మూడు వేల రూపాయలు చెల్లించి మారు పేర్లతో డ్రైవింగ్ లైసెన్సు, పాన్కార్డు పొందాడన్నారు. సూరి హత్య తర్వాత భాను ఇప్పటి వరకు రాష్ట్రానికి రాలేదన్నారు. తను తీసుకెళ్లిన డబ్బులు అయిపోయాయని, కొంత డబ్బు కావాలని మధు అనే మిత్రుడికి పలు సార్లు లేఖలు రాశాడని, ఈ నేపథ్యంలోనే మధు డబ్బు ఇచ్చేందుకు భానుకు హామి ఇచ్చాడన్నారు. డబ్బులు తీసుకెళ్లేందుకే భాను జహీరాబాద్కు వస్తూ దొరికిపోయాడని రమణమూర్తి వివరించారు. అతడి వద్ద స్వాధీనం చేసుకున్న రివాల్వర్, తూటాలు భాను వ్యక్తిగత గన్మెన్ మన్మోహన్సింగ్వని ఎడిజి చెప్పారు. ఈ రివాల్వర్, తూటాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పరీక్షకు పంపుతున్నామన్నారు. విచారణలో భాను చెప్పిన విషయాలను నిర్ధారణ చేసుకునేందుకు గానూ సూరి హత్య తర్వాత భాను ఎక్కడెక్కడ తలదాచుకున్నాడో తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాలు, రాష్ట్రాలకు వెళ్లనున్నామని తెలిపారు.
గత ఏడాది జనవరి మూడున సూరి హత్య జరుగగా, దాదాపు పదిహేను నెలల తరువాత నిందితుడు భానును అరెస్టు కావడం గమనార్హం. టిడిపి ఎమ్మెల్యే పరిటాల రవి, జూబ్లిహిల్స్ కారుబాంబు కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న మద్దెలచెర్వు సూరి హత్య రాష్ట్రంలో నాడు సంచలనం సృష్టించిన సంగతి విదితమే.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more