గుర్రం గుడ్డిదైన... తిండికి తక్కువేమి కాదనే సామెత .. సీఎం కిరణ్ సరిపోతుంది. ప్రజలను పరిపాలించటం చేతగకపోయిన.. వివాదాలు సృష్టించటంలో గ్రేట్ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. నిన్నిటి దాకా బొత్సను వివాదాంలోకి లాగిన విషయం తెలిసిందే. ఈ రోజు రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ అయిన వాయలార్ రవి పై సీఎం కొత్త వివాదం సృష్టింనట్లు తెలుస్తుంది.
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాలపై పూర్తి స్థాయి నివేదిక తయారు చేసేందుకు వచ్చిన వాయలార్ రవికి రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి ఇంట్లో అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
కాంగ్రెసు ముఖ్య నేతలలో చిరంజీవి ఒకరు అని రవి చెప్పారు. చిరంజీవిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటామని చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేశాక ప్రచార పర్వంపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఏ పార్టీలో అయినా భిన్నాభిప్రాయాలు సహజమేనన్నారు. ఉప ఎన్నికలలో సమర్థులకే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ చిరంజీవికి సముచిత స్థానం కల్పించిందని చెప్పారు. తాను గురువారం తూర్పు గోదావరిలో పర్యటిస్తానని చెప్పారు. చిరంజీవితో చర్చించి ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు. చిరంజీవి ఇంటికి అల్పాహార విందుకు రవి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. ఆయన రాజకీయాల్లో తలపండిన నేత అని, ఆయన సలహాలు తీసుకొని ముందుకు వెళతామని చిరు చెప్పారు.
ఇప్పుడు చిరంజీవి ఇంట్లో వాయలార్ రవి, బొత్స, కలిసి విందు చేసుకున్నందుకు.. సీఎం కిరణ్ కు మింగుడు పడటంలేదట. రవి అసల చిరంజీవి ఇంటికి ఎందుకు వెళ్లాడు? ఆ విందులో బొత్స ఎందుకు పాల్గొన్నాడు ? అనే విషయాలపై సీఎం రగిలిపోతున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా .. చిరంజీవి ఎదుగుదలను చూసి సీఎం కిరణ్ కు కుళ్లుపుట్టిందని ..అందుకే.. వాయలార్ రవి పై మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి వదిలినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
సీఎం కిరణ్ అండతో దామోదర్ రెడ్డి రెచ్చిపోయి వాయలార్ రవికి చిరంజీవి ఇచ్చిన విందు పై వివాదం రేపినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్నిమీడియాలో వచ్చే విధంగా సీఎం కిరణ్ ప్లాన్ చేసినట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
రాష్ట్రంలోని పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు తొలగించేందుకు వచ్చిన నేతలు గ్రూపులను ప్రోత్సహించేలా ఉండకూడదని సూచించారు. గ్రూపులు తొలగించడానికి వచ్చిన నేతలు వాటిని ప్రోత్సహించేలా వ్యవహరిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో గ్రూపులను ప్రోత్సహించవద్దని తాను రవికి దామోదార్ చెప్పాడని అంతేకాకుండా అధికార పర్యటనల కోసం వచ్చినప్పుడు అది సరికాదన్నారు. వ్యక్తిగతంగా ఏమైనా అభిమానం ఉంటే పిలిపించుకొని వారితో మాట్లాడుకోవచ్చునని తెలిపారు. పార్టీ పరిస్థితి ఇలాగే ఉంటే 1994 పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మొన్న గులాంన నబీ ఆజాద్, నిన్న కృష్ణమూర్తి ఇప్పుడు వాయలార్ రవి వచ్చారని, రేపు ఎవరొస్తారని దామోదర్ రవి ఎద్దేవా చేశారట. తెలంగాణ ఇచ్చే వరకు తాము అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తామని దామోదర్ రవితో చెప్పినట్లు తెలుస్తుంది.
మాజీ మంత్రి దామోదర్ ఇలా చేయటం వెనక సీఎం కిరణ్ హస్తం ఉందని మీడియా వారు అంటున్నారు. గతంలో గులాం అజాద్ వచ్చినప్పడు ఒక కాంగ్రెస్ నాయకురాలు ఇంట్లో విందు చేసిన సంగతి దామోదర్ కు తెలియాదా? అప్పుడు లేదని ఇప్పుడు కొత్తగా రవిపై విరుచుకపడటం చాలా ఘోరమైన చర్యగా ఉందని మీడియా అంటున్నారు. సీఎం కిరణ్ ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి వివాదాలను సృష్టించటం మంచిదికాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి కుళ్లు రాజకీయాలో చేస్తున్నా కిరణ్ మనస్సు మారితే మంచిదని రాష్ట్ర ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more