కర్ణుడి చావుకు కారణాలనేకమన్నట్లు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఓటమికి సవాలక్ష కారణాలున్నాయి. పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, అభ్యర్థుల ఎంపికలో లోపాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలహీన పడటం, కేంద్ర సర్కారు అవినీతి కుంభకోణాల ప్రభావం, అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేసిన ఉద్యమంతో పాటు యూపీలో కాంగ్రెస్ చేసిన వరుస తప్పులు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి నిరాశాజనకమైన ఫలితాలను మిగిల్చాయి. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ చావు దెబ్బ తినడానికి కారణాలను విశ్లేషిస్తే.. అనేకం ఉన్నాయి.
యూపీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ బీఎస్పీకి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారం పరోక్షంగా సమాజ్వాదీ(ఎస్పీ) గెలవడానికి దోహదపడిందని కాంగ్రెస్ విశ్లేషించింది. మాయావతి అసమర్థ పాలనను ఎండగడుతూ రాహుల్ సాగించిన ప్రచారం ములాయంకు ప్రజల్లో సానుకూల పవనాలకు కారణమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు.
రాహుల్ గాంధీ చేసిన ప్రచారం ఫలించింది.. గానీ.. బిస్పీని ఎత్తి చూపటంతో.. ఆ క్రెడిట్ అంత ఎస్పీ పార్టీ తన్నుకుపోయిందని .. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా .. కాంగ్రెస్ లో సరైన వ్యవస్థ లేకపోవటంతో.. కాంగ్రెస్ ఓటమిని చవిచూడాల్చి వచ్చిందని .. కాంగ్రెస్ వారు అంటున్నారు. ఏమైన ఇది రాహులకు ఒక అనుభవంగా ఉంటుందని .. అంతే తప్ప .. కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలో వరుస తప్పిదాలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకున్నదని కొంత మంది పార్టీ నాయకులు విశ్లేషణ చేస్తున్నారు. ఈ ఫలితాలపై కాంగ్రెస్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. యూపి ఎన్నికల్లో పార్టీ చేసిన తప్పిదాలపై విశ్లేషణ చేసుకుంటోంది. దీనికి ప్రధాన కారణం యూపి శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ యువ నాయకుడు, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే. ఎన్నికల సందర్భంగా చేసిన తీవ్ర తప్పిదాల వల్లే కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకున్నదని పార్టీ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నాయి.
త మంది కేంద్ర మంత్రులతో పాటు సీనియర్ పార్టీ నాయకులు కూడా సంచలనాత్మక అంశాలపై వరసగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, తప్పిదాల వల్ల రాహుల్ గాంధీ 'మిషన్ యూపి 2012' కుప్పకూలిందని పార్టీలో పలువురు నాయకులు అభిప్రాయాపడ్డారు. ఈ ఎన్నికలు ప్రకటించడానికి కొద్ది రోజుల ముందుగా మైనార్టీలకు కల్పించే 4.5 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే పార్టీకి లాభించేదని ఆ పార్టీలోని ఒక వర్గం అభిప్రాయపడింది. కొంతమంది నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల ఉత్తరప్రదేశ్లోని వెనుకబడిన ముస్లింలను పార్టీ ఆకట్టుకోలేకపోయిందని ఆ వర్గం అభిప్రాయపడింది.
స్లిం సబ్ కోటా అంశంపై కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది నేపథ్యంలో 22 ఏళ్ళ నుంచి యూపిలో కాంగ్రెస్ అధికారానికి దూరంగా వుంటోంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిని ముందుగా ప్రకటించకపోవడం, ప్రచారంలో పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్ పుంజుకోలేకపోయిందని వారు అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more