‘స్నేహామేరా జీవితం.. జీవితమే.. స్నేహామేరా’ అంటూ ఒక పాట రాసారు కవిగారు. మనిషి జీవితంలో.. స్నేహం అంటే తెలియని మనిషే ఉండాడు. జీవితం అనే ప్రయాణంలో... చివరి వరకు ఉండేది స్నేహామే. అలాంటి స్నేహాలు ఈ రోజుల్లో కనిపించటం చాలా ఆరుదుగా ఉంటాయి. ఇప్పటి స్నేహం ...సిమ్ కార్డుల మాదిరిగా మారిపోయింది. పైసలు ఉన్నంత చేపు .. మాట్లాడటం ఆ తరువాత .. ఆ సిమ్ కార్డ్ తీసి .. మరొక కొత్త సిమ్ కార్డ్ వేసుకోవటలా మారిపోయింది స్నేహం. ఇప్పడు ఇద్దరు ప్రాణ మిత్రులు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఆ ఇద్దరు ప్రముఖ వ్యక్తులు.
ప్రాణంలో ప్రాణంగా మెలిగిన స్నేహితులు కత్తులు దూసుకునే శత్రు వులుగా మారవచ్చనేందుకు జయలలిత-శశికళలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె ‘సహచరి’ శశికళ స్నేహబంధం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఆ ప్రాణ సఖి శశికళ వల్లే తనకు ముప్పు ఉందని భావిస్తున్న జయలలిత ఆమెను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. పాతికేళ్ల పైబడిన స్నేహబంధం వారిది. జయలలిత అధికారంలో ఉన్నా, లేకున్నా ఆ ఇద్దరూ అడుగులో అడుగేసి నడిచారట. జయలలితకు సర్వస్వం ఆమే…అన్న విధంగా శశికళ ఎదిగారు. ఒక్క శశి మాత్రమే కాదు.ఆమె భర్త నటరాజన్, ఇతర కుటుంబ సభ్యులు జయలలిత ఫ్యామిలీగానే గుర్తింపు పొందారట.
అయితే, కొంతకాలం క్రితం జయలలిత ఈ స్నేహబంధాన్ని హఠాత్తుగా తుంచేసుకొని వారిని ఇంటి నుంచి బయటికి గెంటేశారట అంతేకాకుండా శశికళను, ఆమె భర్త నట రాజ న్ను, బంధువర్గం మొత్తాన్ని పార్టీ ననుంచి బహిష్కరించారని అప్పట్లో కోలీవుడ్ పుకార్లు వినిపించాయి. అసలు జయ లలిత ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో? అంటే తను ప్రాణప్రదంగా చూసుకున్న శశికళ తన పదవి ఎసరు పెట్టబోతోందని జయ లలిత గ్రహించారట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తనను ఆ పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని జయలలిత గ్రహించారట. తన పై ఉన్న కేసులు కనక రుజువైతే పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని, అప్పుడు నటరాజన్ను ముఖ్యమంత్రిని చేయాలని కుట్ర చేస్తున్నారని గ్రహించిందని తమిళ ప్రజలు అంటున్నారు. అసలు ఈ కుట్రకు సూత్రధారి శశికళే అని తెహల్కా పత్రిక గతంలో రాసిందట. తనను సీఎం పదవి నుంచి కూలదోసి, శశికళ భర్త నటరాజన్ను సీఎం చేయడానికి పథకం సిద్ధం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండమని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జయలలితను హెచ్చరిం చారట. జయలలిత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన కొన్ని నెలలకే మోడీ ఈ హెచ్చరిక చేయటం జయకు ఆశ్చర్యన్ని కలిగించిందట. అంతేకాకుండా చుట్టూ ఉన్నవారితో, ముఖ్యంగా శశికళ విషయంలో జాగ్రత్త గా ఉండమని హితవు చెప్పాడట.
అయితే జయలలితకు, మోడీకి ఎప్పటి నుంచో రాజకీయంగా మంచి సంబందాలున్న విషయం తెలిసిందే. . కొంతకాలం కిందట గుజరాత్లో ఓ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త ఓ ప్రాజెక్టును నెలకొల్పేందుకు తమిళనాడుకు వచ్చాడట. అయితే ఇక్కడ ఏ పని జరగాలన్నా మన్నార్గుడి మాఫియా (ఎంఎం) అండలేందే జరగదని తెలిసిందట. మన్నార్ గుడి మాఫియా అంటే ఎవరో కాదు, శశికళ అండ్ కో మొత్తం ప్రాజెక్ట్ విలువలో తమకు 15 శాతం కమీషన్ ఇవ్వాలని శశికళ బృందం డిమాండ్ చేసిందట. ఆ ఎన్ఆర్ఐ గుజరాత్ వెళ్లి నరేంద్రమోడీకి చెప్పటం ఆయన వెంటనే ఈ విషయం జయలలితకు చెప్పటంతో శశికళ ప్రవర్తనపై అనుమానం వచ్చిందట.
అయితే సింగపూర్లో పరిశ్రమలున్న ఎన్ఆర్ఐకే ప్రాజెక్టు ఇద్దామని సీఎం భావించారట. రాతకోతలన్నీ పూర్త య్యాక తన వద్దకు వచ్చిన ఫైల్ను చూసి జయలలిత షాకయ్యారట. ఆ కాంట్రాక్ట్ ను మరో కంపెనీకి ఇవ్వాలంటూ మలేసియా ప్రభుత్వం ఆదేశిస్తున్నట్టు ఆ ఫైల్ తయారై వచ్చిందట. పైగా, ఆ కాంట్రాక్ట్ను మలేసియా కంపెనీకి ఇవ్వాలని తమిళనాడు సీఎం రాసినట్టు ఫైల్లో ఉండటమే కాకుండా జయ సంతకాలూ కూడా ఉన్నాయట అప్పడు మళ్లీ శశికళపై అనుమానం బలపడిందని జయ లలిత సన్నిహితులు అంటున్నారు.
జయ వెంటన ఈ ఫైల్పై సంతకాలు ఎవరివని శశికళను నిలదీశారని ఆమె తనకు తెలీదని చెప్పటంతో అప్పుడు ఒకరిపట్ల ఒకరికి విశ్వాసం సన్నగి ల్లిందని తమిళ ప్రజలు అంటున్నారు. అయితే శశికళపై అనేక భూకుంభకోణాల కేసు చిట్టా అంతా జయలలిత వద్ద ఉందట. అంతేకాకుండా మన్నార్గుడి మాఫియా గుట్టంతా జయలలిత తన చేత చిక్కించుకొని .. వేటు వేయటం కోసం జయ సిద్దంగా ఉందని జయ మంత్రి వర్గం గుసగుసలాడుకుంటున్నారు.
అసలు ఇది అంతా మోడీ సలహాతోనే జయలలిత జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. శశి బయట ఉంటే తనకు ముప్పని గ్రహించి ముందు జాగ్రత్తగా, ఈ కేసు ల్ని చూపి జయలలిత శశికళను అరెస్ట్ చేయటం కోసం ఎదురు చూస్తుందని తమిళ నాడు ప్రజలు అనుకుంటున్నారు
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more