సంచలనాలకు మారు పేరుగా మారిన జీవిత – రాజశేఖర్ లు ఈ మధ్యన మీడియాకి కనబడటం లేదు. వీరు ఎందుకు కనబడటం లేదు ? సినిమాల్లో బిజీగా ఉన్నారా ? లేక ఎవరూ వీరిని దగ్గరికి రానీయడం లేదా ? అంటే వీరిని అన్ని రాజకీయ పార్టీలు దూరం కొట్టడంతో మీడియాకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని అనుకుంటున్నారు. అయితే వీరు ఆ మధ్యన చిరు పై, ఆయన బ్లడ్ బ్యాంక్ పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారు మళ్ళీ చిరంజీవితో రాజీకి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
జీవిత రాజశేఖర్.... సినీమా నటులే కాకుండా నిజ జీవితంలో నటించడంలో జీవిస్తారు. అప్పట్లో వీరు రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఈ జంట సంచలన ప్రకటనలకు మారు పేరుగా తయారయ్యారు. వైయస్ హయాంలో ఆయన పై అభిమానంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వైయస్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రకటనలు తనకు వచ్చే విధంగా చేసుకొని అప్పుడు కొన్ని డబ్బులు సంపాదించుకున్నారు.
అంత వరకు బాగానే ఉన్నా.... ప్రజల కోసం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని వైయస్ రాజశేఖర్ రెడ్డి అండతో ఆ పార్టీ పై బురద జల్లి ఆపార్టీ దెబ్బ తినడానికి కారణం అయ్యారు. దీనికి తోడు ఆయన బ్లడ్ బ్యాంక్ పై కూడా వేరే వారి దగ్గరి నుండి డబ్బులు తీసుకొని బురద జల్లారు. వైయస్ మరణం తరువాత వీరికి కాంగ్రెస్ పార్టీలో అంత ప్రాధాన్యం లేకపోవడంతో వైయస్ తనయుడు జగన్ వైపు వచ్చారు. ఇక్కడ జగన్ కూడా వారిని ఆమడ దూరం ఉంచడంతో... వీరు మరీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన పై విమర్శలు చేశారు. దీంతో వీరిని ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా దగ్గరికి రానీయడం లేదు.
‘‘ మూలిగే నక్క పై తాటి కాయ పడ్డట్టు’’ ఇటు సినిమాలు లేక, అటు రాజకీయంగా ఎదుగుదల లేక కుమిలిపోతున్న జీవిత రాజశేఖర్లు ఈ మధ్యన అల్లు అరవింద్ తో మళ్ళీ బేరసారాలు నడుపుతున్నారట. మేం తప్పు చేశాం. మమ్మల్ని క్షమించండి. ఇక నుండి అందరం ఫ్రెండ్స్ లాగా కలిసి ఉందాం. చేసిన తప్పులకు ప్రయాశ్చిత్తం లేదు. మీరు క్షమించి మమ్మల్ని ఆదరించండి అని రాయభారాలు పంపుతున్నారట. వీరు పదే పదే రాయభారాలు పంపడంతో సున్నిత మనస్కుడైన చిరంజీవి సూచన ప్రాయంగా అంగీకరించాడట. కానీ అల్లు అరవింద్ మాత్రం ససేమిరా అంటున్నాడట. అలాంటి వాళ్ళని క్షమిస్తే మళ్ళీ ఏదో ఒక రోజు మనపైకే వస్తారు. వీరికి తగిన బద్ధి చెప్పాలే కానీ దగ్గరకు రానీయకూడదని అనుకుంటున్నాడట.
కొంత మందికి కోర్టుల ద్వారానే బుద్ధి రావాలి, ఒక వ్యక్తిని దూషించేటప్పుడు వెనుకా ముందు ఆలోచించాలి. మనిషి వ్యక్తిత్వం ఒక ఆస్తి లాంటిది. దానికి విలువనిస్తూ కావాడుకోవాలి. కానీ ఇలా డబ్బులు తీసుకొని ఆస్తిలాంటి వ్యక్తిత్వం పై బురద జల్లటం మంచిది కాదని, చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంక్ వల్ల ప్రజలకు అవగాహన వచ్చిందే కానీ, ఎటువంటి నష్టం జరగలేదు. ఇలా నిందలు వేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని, వారికి తగిన బుద్ధి కోర్టుల ద్వారానే వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more