ఇప్పుడు జగన్ పరిస్థితి .. ఒక్క పక్క ఆనందం, మరోక పక్క బాధ కనిపించకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు జగన్. గతంలో నా వెనుక చాలా మంది ఎమ్మేల్యేలు ఉన్నారని సంఖ్యల మీద చెప్పిన జగన్ కు నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానంలో.. తన సంఖ్య ఎంతో తెలిసిపోయింది. తన వెనక ఉన్నది కొంది మంది మాత్రయే అని అటు ప్రజలకు , ఇటు ప్రభుత్వవానికి తెలిసింది. ఇక జగన్ వర్గం నుండి ఎలాంటి భయం లేదని సిఎం కిరణ్ ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే అసెంబ్లీలో జగన్ పార్టీని ధీటుగా ఎదురుకున్న వ్యక్తి బొత్స. అసెంబ్లీలో .. వైఎస్ భార్య విజయమ్మ అడిగిన వాటికి .. బొత్స .. సమాధనం చెప్పటంత.. జగన్ వర్గంలో.. కాస్త భయం పట్టుకందని తెలిసింది. చివరకు అవిశ్వాస తీర్మానంలో.. కొంత మంది ఎమ్మేల్యేలతో జగన్ పార్టీ అవిశ్వాసం తెలిపింది. అయితే తనకు మద్దతు తెలిపిన ఎమ్మేల్యేలకు జగన్ ప్రత్యేక విందు ఏర్పటు చేసారని వైఎస్ పార్టీ సభ్యులు అంటున్నారు. అదే జగన్ మాట్లాలోనే విన్నద్దాం.
అసెంబ్లీలో నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానం దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక సంఘటన అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశ్వసనీయతకు, విలువలకు వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు అర్థం చెప్పారన్నారు. తమ పదవులు పోతాయని తెలిసినా రైతుల పక్షాన నిలబడిన ఎమ్మెల్యేలకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని వైఎస్ జగన్ అన్నారు. అధికార పార్టీలో ఉండి ప్రజల తరపున నిలిచి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటువేసి వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు కొత్త రాజకీయాలకు నాంది పలికారన్నారు. తనకు తోడు నిలిచిన ఎమ్మెల్యేలను చూసి తాను గర్వపడుతున్నానని ఆయన అన్నారు. విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి ఉన్న ఎమ్మెల్యేలతో ప్రజలలో వెళతానని జగన్ తెలిపారు.
రైతు సమస్యలపై కనీస అవగాహన లేనివారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ మీద విమర్శలకే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సభలో నిన్న ఎక్కువ సమయం కేటాయించారని ఆయన విమర్శించారు. అసలు రైతు సమస్యలపైనే చర్చ జరగకపోవటం బాధాకరమన్నారు. గ్రామాల్లోకెళితే రైతుల సమస్యలు తెలుస్తాయన్నారు. పత్తి, పొగాకు, చెరకు, వరి పండిస్తున్న రైతులు అష్టకష్టాలు పడుతున్నారని జగన్ పేర్కొన్నారు. మరోవైపు సాక్షాత్తు అసెంబ్లీ వేదిక చేసుకుని కాంగ్రెస్ నేతలు ప్రలోభాలకు దిగారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తనకు అండగా ఉన్న ఎమ్మెల్యేలను ప్రలోభాల పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారని, లొంగకపోవటంతో బెదిరింపులకు దిగటం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ధైర్యం ఉంటే తమ ఎమ్మెల్యేలపై ఒకేసారి అనర్హత వేటు వేయాలన్నారు.
జగన్ ప్రభుత్వం పై చేసిన విమర్శలకు వెంటనే కాంగ్రెస్ మంత్రి శైలజానాథ్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో జగన్ బలమెంతో తేలిపోయిందని, తాము బలపర్చిన అవిశ్వాసం ఓడిపోయిందన్న బాదతో జగన్ చేస్తున్న ఆరోపణలు పట్టించుకోనవసరం లేదని ఆయన అన్నారు. తాము ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టేందుకు యత్నించామన్న అంశంతో వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఎన్నికైన ఎమ్మేల్యేలుగా ఒకటికి రెండుసార్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వెయ్యాల్పిందిగా కోరడంలో తప్పులేదని ఆయన చెప్పారు.
అయితే జగన్ వారి ఎమ్మేల్యేలకు తేనీటి విందు ఏర్పాటు చేస్తున్నరని తెలుసుకొని .. మంత్రి శైలజానాధ్ కూడా .. ముఖ్యమంత్రితో క్యాంపు కార్యాలయంలో మంతనాలు జరిపి.. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి సహచర మంత్రులకు తేనీటి విందు ఏర్పాటు చేస్తున్నట్లు .. గాంధీభవనంలో కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ వారు గెలిచిన ఆనందంలో ఉన్నారు. జగన్ తనకు కొంత మంది దొరికినందుకు ఆనందంలో ఉన్నారు. ఇక మిగిలింది. బాబు, కేసిఆర్ .. వీరు మాత్రం వారి వ్యక్తిగత ఆనందంలో వారు ఉన్నారని తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more