అస్ట్రేలియాలో జరుగుతున్న 21వ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ రెండో రోజు కూడా అదరగొట్టింది. తొలి రోజున ఒక స్వర్ణంతో పాటు మరో రజత పతకాన్ని ఖాతాలో వేసుకున్న భారత్.. రెండో రోజును కూడా పసిడి పతకాన్ని ఖాతాలో జమేసుకుంది. అయితే తొలి పతకంగా రజతంతో భారత్ ఖాతాను తెరచిన గురురాజా సహా స్వర్ణం సాధించిన మీరాబాయ్ చాను కూడా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే రెండో రోజున భారత్ కు మరో స్వర్ణం దక్కింది. మహిళల 53 కేజీల విభాగంలో భారత్ కు చెందిన సంజిత చాను స్వర్ణం కైవసం చేసుకుంది. భారత్ ఇప్పటి వరకు గెలిచిన మూడు పతకాలు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే దక్కడం విశేషం.
ఇవాళ రెండో రోజు స్వర్ణం గెలిచిన సంజితా చానుపై ట్విటర్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘భారతీయ నారీమణులు అందరి కంటే ఎంతో గొప్పవారు. మరో స్వర్ణం గెలిచాం. భారత్ కు రెండో బంగారు పతకం అందించిన సంజితా చానుకు అభినందనలు’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ‘ఈ రోజు గొప్ప ఆరంభం దక్కింది. సంజితా చానుకు కంగ్రాట్స్. ఎంతో గర్వంగా ఉంది’ అని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అన్నాడు. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో సంజితా చాను 48 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండు స్వర్ణాలు, ఒక రజతంతో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ (12), ఆస్ట్రేలియా (15) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more