ఒడిశాలో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సుందర్గఢ్ జిల్లా లాహునిపరా - బహర్పోసి రహదారిలో వెళ్తున్న మినీ ట్రక్ బోల్తా పడటంతో.. అందులో ప్రయాణిస్తున్న 9 కబడ్డీ ఆటగాళ్ల మరణించారు. మరో 15 మంది కబడ్డీ అటగాళ్లు తీవ్రగాయాలపాలయ్యారు. కబడ్డీ అటగాళ్లు ప్రయాణిస్తున్న మినీ ట్రక్ బొల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో ముగ్గురు క్రీడాకారులు అక్కడికక్కడే మరణించగా... మరో ఐదుగురు క్రీడాకారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. దుడిగాంలో వీరంతా టోర్నమెంట్లో పాల్గొని వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని... ఈ నేపథ్యంలో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం రూర్కెలా తరలిస్తున్నట్లు చెప్పారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more