ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-3 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీమిండియా తన సత్తాను చాటింది. ఓవైపు టీ20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ను కూడా హస్తగతం చేసుకుని మీసాన్ని మెలేసింది టీమిండియా. ఇంగ్లాండ్ పై వారి స్వదేశంలో అతిధిగా వెళ్లిన టీమిండియా.. ఎక్కడా వెనక్కు తగ్గకుండా ఈ రెండు సీరీస్ లను 2-1తో గెలుచుకుని విజేతగా నిలించింది. దీంతో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దిగ్గజ క్రికెటర్లు, ప్రముఖులతో పాటు అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి కితాబులు అందుకుంటోంది టీమిండియా.
తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలిపాడు. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా జట్టు అదిరిపోయే ప్రదర్శన ఇచ్చిందని కితాబిచ్చాడు. ట్విటర్ వేదికగా గంగూలీ స్పందిస్తూ… ‘ఇంగ్లండ్ లో అద్భుత ప్రదర్శన. వాళ్ల దేశంలో ఇంగ్లండ్ ను ఓడించడం అంత ఈజీ కాదు. టెస్టులలో 2-2 తో సిరీస్ సమం చేసి టీ20, వన్డేలలో సిరీస్ నెగ్గడం గొప్ప విషయం. వెల్ డన్ ద్రావిడ్, రోహిత్ శర్మ, రవిశాస్త్రి (గతేడాది నాలుగు టెస్టులకు శాస్త్రినే హెడ్ కోచ్), విరాట్ కోహ్లీ. పంత్ చాలా స్పెషల్..’అని ట్వీట్ చేశాడు.
ఇంగ్లండ్ తో మాంచెస్టర్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగినా.. దానిని భారత బౌలర్లు వరుస వికెట్లతో నియంత్రించారు. దీంతో 45.5 ఓవర్లలో 259 పరుగులుకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. జోస్ బట్లర్ (60) టాప్ స్కోరర్. అనంతరం భారత జట్టు 42.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (125 నాటౌట్) వన్డేలలో తొలి సెంచరీ చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత్ సిరీస్ ను 2-1 తో గెలిచింది. అంతకుముందు టీ20లలో కూడా 2-1తో సిరీస్ ను నెగ్గిన విషయం విదితమే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more