కరోనా మహమ్మారి రెండో దశ వేగం తగ్గినా.. మూడవ దశ కూడా త్వరలోనే వస్తుందన్న వార్తల నేపథ్యంలో భారత్ లో జరగాల్సిన మెగా టోర్నీ తరలిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించలేమని స్పష్టం చేసిన భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ), యూఏఈలో టోర్నీని నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. భారత్ లో ప్రస్తుతం వున్న పరిస్థితులను సమీక్షించిన బిసిసిఐ.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మెగాటోర్నీలో పాల్గోనే ప్లేయర్ల ఆరోగ్యం, రక్షణను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిసిసిఐ స్పష్టం చేసింది.
భారత్ లో టీ20 వరల్డ్ కప్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలికి చెప్పేందుకు ఇవాళ అఖరి రోజు. దీంతో పరిస్థితిని సమీక్షించిన మీదట టోర్నీని దుబాయ్ కి తరలించేందుకు నిర్ణయం తీసుకన్నామని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఈ మేరకు ఇవాళ జరిగిన బీసీసీఐ ఆఫీస్ బేరర్ల మధ్య కాన్ఫరెన్స్ కాల్ జరిగిన ఆనంతరం నిర్ణయం తీసుకున్నారని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ విషయాన్ని ఐసిసికి ఇవాళ సాయంత్రం వెల్లడిస్తామన్నారు. షెడ్యూల్ ను ఇంకా పూర్తిస్థాయిలో రూపొందించలేదని, త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
రానున్న 2-3 నెలల్లో ఏం జరుగుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని టోర్నీని యూఈఏకి తరలిస్తామని ఐసీసీతో చెప్పాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎందుకంటే ఇండియా తర్వాత టీ20 వరల్డ్కప్కు యూఏఈయే మంచి వేదిక. ఇండియాలోనే నిర్వహించాలని అనుకున్నాం. ఇండియానే మా మొదటి ప్రాధాన్యతగా భావించాం. కానీ తప్పలేదు. టోర్నీ తేదీల్లో ఎలాంటి మార్పులు లేవు. ఐపీఎల్ ముగియగానే ప్రారంభమవుతుంది. క్వాలిఫయర్స్ ఒమన్ లో జరగొచ్చు. టోర్నీలో మ్యాచ్ లు మాత్రం దుబాయ్, అబుదాబి, షార్జాల్లో జరుగుతాయి అని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
As far as T20 World Cup is concerned, today was the deadline when we're supposed to inform the ICC about our decision. So, today there was a conference call amongst BCCI office bearers. We met & looked at the COVID situation: BCCI Vice-President Rajeev Shukla (1/3) pic.twitter.com/RiRSK6hw5t
— ANI (@ANI) June 28, 2021
...Nobody is really sure what is going to happen after 2-3 months. Keeping all things in mind, a decision has been taken that BCCI will inform ICC to move it to UAE because that's ideal venue after India. We wanted to host it in India &our first priority was India: Rajeev S (2/3)
— ANI (@ANI) June 28, 2021
Dates are going to be same. Immediately after IPL it will start. Qualifiers may take place in Oman & rest of the matches will be on three grounds -- Dubai, Abu Dhabi & Sharjah: BCCI Vice-President Rajeev Shukla (3/3)
— ANI (@ANI) June 28, 2021
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more