టీమిండియా వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికుతున్నట్లు ఇవాళ ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లకు ఆయనగుడ్ బై పలుకుతున్నట్లు ట్విటర్ మాద్యమం ద్వారా వెల్లడించాడు. క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కుడిగా గుర్తింపు తెచ్చుకున్న పార్థీవ్ 18 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించాడు. టీమిండియా తనపై విశ్వాసాన్ని ఉంచి 17 ఏళ్ల వయసులోనే అవకాశం కల్పించిందని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నాడు. భారత్ తరఫున పార్థివ్ 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. శ్రీలంకతో 2012లో చివరి వన్డే ఆడాడు.
‘‘అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు ప్రకటిస్తున్నా. 18 ఏళ్ల నా క్రికెట్ ప్రయాణాన్ని నేటితో ముగిస్తున్నా. నా కెరీర్లో సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. 17 ఏళ్ల వయసులో నాపై విశ్వాసాన్ని ఉంచి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. కెరీర్లో మార్గదర్శకం చేస్తూ అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’’ అని పార్థివ్ పేర్కొన్నాడు. కెప్టెన్లందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తొలి అవకాశం ఇచ్చిన గంగూలీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. 2002లో దాదా కెప్టెన్సీలోనే పార్థివ్ ఇంగ్లాండ్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు.
పార్థివ్ పటేల్ తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో టెస్టుల్లో 934, వన్డేల్లో 1696 పరుగులు సాధించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ పాటు పోటీ క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు పార్థివ్ వెల్లడించాడు. ఐపీఎల్ లో తనకు అవకాశాలు ఇచ్చిన జట్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఓపెనర్ గా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడిన అతడు లీగ్ లో 2848 పరుగులు చేశాడు. 13వ సీజన్లో బెంగళూరు జట్టులో తరపున ప్రాతినిధ్యం వహించినా.. ఆయనకు ఆడే అవకాశం మాత్రం రాలేదు, గత 13 సీజన్లలో అతడు ముంబయి, చెన్నై, బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, దేశవాళీలో 194 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 11,240 పరుగులు చేయగా, అందులో 27 శతకాలతో సత్తా చాటాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more