కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు స్తంభించిన నేపథ్యంలో.. క్రికెట్ ఆడి ఆ డబ్బులను ఇరు దేశాలు కరోనా వైరస్ నియంత్రణకు వినియోగించుకోవచ్చున్న పాకిస్థాన్ పేస్ దిగ్గజం షోయబ్ అక్తర్ వాఖ్యలపై మరోమారు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. క్రికెట్ కోసం ఎప్పటికైనా తలుపులు తెరుచుకుంటాయని అయితే అంతకన్నా ముందు విద్యా సంస్థలు తెరచుకోవాలని కపిల్దేవ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ పునరుద్ధరణ గురించి కాకుండా విద్యార్థుల చదువుల గురించి ఆలోచించాలని సూచించారు.
తాజాగా ఓ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన కపిల్.. ‘నేను విశాల దృక్పథంతో ఆలోచిస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం క్రికెట్ గురించి మాట్లాడటం సమంజసం కాదు. నేనైతే విద్యార్థుల చదువుల గురించి ఆందోళన చెందుతున్నా. వాళ్లంతా మన భావితరాలు. విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నేనైతే.. ముందు విద్యాసంస్థలు తెరచుకోవాలని అనుకుంటున్నా. ఆ తర్వాత క్రికెట్, ఫుట్బాల్ వాటంతటవే పునఃప్రారంభం అవుతాయి’ అని అన్నారు.
ఈ సందర్భంగా కపిల్ మరోసారి షోయబ్అక్తర్ గురించి స్పందించారు. కరోనాపై పోరులో విరాళాల సేకరణకు భారత్-పాక్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆడాలని అక్తర్ సూచించిన సంగతి తెలిసిందే. ఇదివరకే దీన్ని ఖండించిన కపిల్ మరోసారి తన అభిప్రాయాన్ని తేల్చిచెప్పారు. ‘అక్తర్ చెప్పిన విషయాన్ని భావోద్వేగంగా ఆలోచిస్తే అవుననే అంటారు. భారత్-పాక్ మ్యాచ్లు ఆడొచ్చు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్లు ఆడటం ముఖ్యంకాదు. మీకు డబ్బు అవసరమైతే ముందు బార్డర్లో పరిస్థితులు అదుపు చేయండి.’ అని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more