భారత్ లో క్రికెట్ దేవుడిగా మన్ననలు అందుకునే సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ యవనికపై నమోదు చేసిన రికార్డులు అన్నీఇన్నీ కావు. అంతటి దిగ్గజం కూడా తొలి సిరీస్ లో ఎంతో నిరాశకు గురయ్యాడట. పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో కెరీర్ ముగిసినట్టేనని భావించాల్సి వచ్చిందని సచిన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సచిన్ 16 ఏళ్ల వయసులోనే భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. సచిన్ తొలి పర్యటన పాకిస్థాన్ లో జరిగింది.
ఆ సమయంలో వసీం అక్రమ్, వకార్ యూనిస్ జోడీ శత్రుభీకర ద్వయంగా పేరుతెచ్చుకుంది. అలాంటి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూ సచిన్ తన తొలి అంతర్జాతీయ ఇన్నింగ్స్ లో 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దాంతో అదే తన చివరి ఇన్నింగ్స్ అని నిర్ధారణకు వచ్చేశాడట. అయితే తన ఆలోచనా సరళిని అప్పటి సీనియర్ ఆటగాడు రవిశాస్త్రి మార్చేశాడని సచిన్ వివరించాడు. రవిశాస్త్రి ఇచ్చిన సలహా తన కెరీర్ నే మార్చేసిందని చెప్పాడు.
"ఈ మ్యాచ్ ను ఓ స్కూల్ మ్యాచ్ తరహాలో ఆడేశావు. అయితే నువ్వు ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్ జోడీని ఎదుర్కొన్నావని గుర్తుంచుకోవాలి. వాళ్ల సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని గౌరవించాలి. మైదానంలోకి వెళ్లి ఓ గంటసేపు క్రీజులో నిలిచావంటే వాళ్ల పేస్ కు ఈజీగా అలవాటు పడతావు. అక్కడి నుంచి ప్రతిదీ నీ నియంత్రణలోకి వస్తుంది" అని రవిశాస్త్రి హితవు పలికాడని, ఆ మరుసటి మ్యాచ్ లో రవిశాస్త్రి చెప్పింది అక్షరాలా పాటించి 59 పరుగులు చేశానని సచిన్ వెల్లడించాడు. అక్కడి నుంచి ఆటపై తన దృక్పథంలో మార్పు వచ్చిందని, ఇదే మొదటిది, చివరి సిరీస్ అనుకున్న తాను ఆపై వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదని తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more