బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ తీసుకువచ్చిన ప్రతిపాదన అద్భుతమంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది. అస్ట్రేలియా క్రికెట్ (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ దాదా ప్రతిపాదించిన వన్డేల సూపర్ సిరీస్ ఆలోచన ఎంతో సృజనాత్మకంగా ఉందని కొనియాడారు. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, మరో దేశం కలిపి 2021 నుంచి ప్రతి ఏటా నాలుగు దేశాల టోర్నీ ఆడాలని దాదా గతంలో ఆ బోర్డులతో చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని ఇటీవల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సీఏ కూడా స్పందించింది.
‘‘బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ప్రతిపాదించిన ఆలోచన సృజనాత్మకమైనది. అతడి పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే కోల్కతాలో చారిత్రక డే/టెస్టు నిర్వహించాడు. అది ఎంతో సత్ఫలితాన్నిచ్చింది. ఇప్పుడు సూపర్ సిరీస్ అనే మరో మంచి ఆలోచనతో ముందుకు వచ్చాడు. వచ్చే నెలలో భారత్, బంగ్లాదేశ్తో క్రికెట్ క్యాలెండర్ గురించి చర్చిస్తాం. ఆ తర్వాత పాక్, కివీస్తో కూడా మాట్లాడతాం. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. ప్రపంచ క్రికెట్ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాం. వచ్చే ఏడాది అఫ్గానిస్థాన్కు ఆతిథ్యం ఇవ్వనున్నాం. ప్రపంచ క్రికెట్పై మాకు ఉన్న గౌరవానికి ఇది ఉదాహరణ’’ అని రాబర్ట్స్ అన్నారు.
‘‘ఉపఖండంలో క్రికెట్ అనేది ఓ మతం. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో క్రికెట్ అందరికీ ఫేవరేట్. అన్ని దేశాల్లోనూ క్రికెట్ అభివృద్ధి చెందుతుంది. న్యూజిలాండ్తో మాకు మంచి అనుబంధం ఉంది. 2023-31 వరకు క్రికెట్ క్యాలెండర్ గురించి మేం చర్చించుకున్నాం. మరో 32 ఏళ్ల వరకు కివీస్ను బాక్సింగ్ డే టెస్టుకు ఆహ్వానించాలని ఆశిస్తున్నాం. ప్రపంచంలో టెస్టులను నిర్వహించడానికి మెల్బోర్న్, లార్డ్స్ మైదానాలు ఎంతో ప్రసిద్ధి’’ అని ఆయన తెలిపారు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా భారత్లో పర్యటించనుంది. మూడు వన్డేలు ఆడనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more