వన్డే జట్టులో తిరిగి చోటు సంపాదిస్తానని టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె ధీమా వ్యక్తం చేశాడు. ‘‘గత రెండేళ్లగా నా రికార్డు బాగానే ఉందనేది నిజం. క్రికెట్ అనేది ఫన్నీ గేమ్. అందులో ఏమైనా జరగొచ్చు. తిరిగి వన్డే జట్టులో చోటు సంపాదిస్తాననే నమ్మకం ఉంది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అవరోధాలు ఎదురైనప్పుడు అక్కడే ఆగి మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. 2019 ప్రపంచకప్లో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ సమయంలో ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడి నా ఆటతీరుని మెరుగుపర్చుకున్నా. అంతేకాకుండా వ్యక్తిగా కూడా ఎదిగా. ఆ రెండు నెలల్లో ఏడు మ్యాచ్లు ఆడా. ఆన్ ఫీల్డ్తో పాటు ఆఫ్ ఫీల్డ్లోనూ ఎంతో నేర్చుకున్నా’’ అని తెలిపాడు.
‘‘కొన్ని సార్లు పార్క్లో ఒంటరిగా జాగింగ్కు వెళ్తూ ఉంటా. కాఫీ తాగుతూ గత రోజులను గుర్తు చేసుకుంటాను. అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేయక ముందు క్లబ్ క్రికెట్ ఆడే రోజుల్లో నా మనస్తత్వం ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకుంటాను. నా ప్రశ్నలకు అవి సమాధానమిస్తుంటాయి’’ అని రహానె పేర్కొన్నాడు. వన్డేల్లో భారత తరఫున అతడు చివరిగా 2018, ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడాడు. సఫారీలతో జరిగిన ఆ సిరీస్లో అతడు 35 సగటుతో 140 పరుగులు చేశాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. 2019 ప్రపంచకప్కు ఎంపికవ్వలేదు. భారత్ తరఫున ఇప్పటివరకు అతడు 63 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 4.112 పరుగులు, వన్డేల్లో 2,962 పరుగులు, టీ20ల్లో 375 పరుగులు చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more