వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా జట్టు తమ విజయాల పరంపరను కొనసాగిస్తూ అతిథ్యజట్టుపై అధిపత్యాన్ని కనబరుస్తూనే వుంది. వరుసగా మూడు టీ20 మ్యాచులను తమ ఖాతాలో వేసుకున్న టీమిండియా నాల్గో మ్యాచ్ లోనూ అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా టీమిండియా బౌలర్లు రాణించడంతో వెస్టిండీస్ పై భారత మహిళా జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా గయానాలో జరిగిన నాలుగో మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు.
దీంతో మ్యాచ్ ను అంపైర్లు తొమ్మిది ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. భారత బ్యాట్స్ ఉమెన్ తడబాటుకు గురై వికెట్లను జారవిడుచుకున్నారు. ఒక్క పూజా వస్త్రకార్ మినహాయించి ఎవ్వరూ రెండెంక్కెల స్కోరుకు చేరుకోలేకపోయారు. విండీస్ బౌలర్లలో మాథ్యూస్ (3/13) సత్తా చాటింది. దీంతో టీమిండియా ఉమెన్స్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ బౌలర్లలో మాథ్యూస్ (3/13) సత్తా చాటింది.
నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచులో వెస్టిండీస్ ను భారత బౌలింగ్ కుప్పకూల్చింది. భారత బౌలర్ల రాణించడంతో వారి ధాటికి విండీస్ మహిళల జట్టు నిలవలేకపోయింది. విండీస్ జట్టు చివరి వరకు పోరాడినా ఐదు వికెట్ల నష్టానికి 45 పరుగులే చేయగలిగింది. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పిన్నర్లపై పెట్టుకున్న ఆశలను వారు నిలబెట్టు కున్నారు. అంజు (2/8), దీప్తి శర్మ (1/8), రాధ (1/8) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టీమ్ఇండియా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఫలితంగా హర్మన్ప్రీత్ సేన 5 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. సిరీస్లో ఇప్పటికే 4-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్ చివరి మ్యాచ్ను నవంబర్ 20న ఆడనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more