పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో రానున్న క్రికెట్ ప్రపంచ కప్ లో పాకిస్థాన్ తో ఆడకూడదనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన శత్రుదేశమైన పాకిస్థాన్ తో ఆడి, వారిని చిత్తుగా ఓడించాలని అన్నారు. ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకపోతే నష్టం భారత దేశానికే కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే పాక్ ను ఏకంగా వరల్డ్ కప్ నుంచే తప్పించాలన్న డిమాండ్ సాధ్యం కాకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు.
ఆ ప్రతిపాదనను ఇతర దేశాలు అంగీకరించకపోవచ్చని తెలిపారు. రెండు దేశాల మధ్య సమస్యలోకి... తమను లాగవద్దని చెప్పే అవకాశం ఉందని చెప్పారు. ఇక వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఆడకపోతే మనం రెండు పాయింట్లు కోల్పోతామని గవాస్కర్ చెప్పారు. పాక్ తో మనం మ్యాచ్ ఆడకపోతే అది ఆ దేశంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని... ఇదే సమయంలో ప్రపంచకప్ లాంటి టోర్నమెంట్ లో రెండు పాయింట్లను కోల్పోవడమంటే చిన్న విషయం కాదని... టోర్నమెంట్ నుంచి బాధతో నిష్క్ర్రమించే అవకాశాలు కూడా ఉంటాయని తెలిపారు.
పాక్ తో మనం ఆడి, ఆ జట్టు సెమీస్ కు చేరకుండా నిలువరించాలని చెప్పారు. పాకిస్థాన్ తో ఆడకున్నా... నాకౌట్ కు క్వాలిఫై కాగల సత్తా టీమిండియాకు ఉందనే విషయం తనకు తెలుసని తెలిపారు. నయా పాకిస్థాన్ ను నిర్మిస్తానన్న తన మిత్రుడు, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందు మంచి అవకాశం ఉందని సునీల్ గవాస్కర్ చెప్పారు. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ఇమ్రాన్ ఒక స్నేహపూర్వక అడుగు వేయాలని... దీనికి ప్రతిస్పందనగా భారత్ మరెన్ని అడుగులు వేస్తుందో చూడాలని తెలిపారు.
పుల్వామా ఉగ్రదాడికి బాధ్యుడైన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ను ఐక్యరాజ్యసమితికి కానీ, భారత్ కు కానీ ఇమ్రాన్ అప్పగించాలని చెప్పారు. ఏదైనా మాటల్లో ఉండరాదని, చేతల్లో ఉండాలని అన్నారు. టెర్రరిజాన్ని అంతం చేసే దిశగా పని చేయాలని... నయా పాకిస్థాన్ ను నిర్మించుకోవాలని తన మిత్రుడుని కోరుతున్నానని చెప్పారు. లేకపోతే పాకిస్థాన్ ఎప్పటికీ భారత్ వ్యతిరేకిగానే మిగిలిపోతుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more