క్రికెట్ లవర్స్కు పండుగ సీజన్ ప్రారంభమైంది. ఐపీఎల్ 2019 టోర్నీకి సంబంధించిన తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ సీజన్ 12 మార్చి 23 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. చెన్నైలో ఆరంభ వేడుకలు జరగనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే మ్యాచ్ డిటెయిల్స్ను ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.
ప్రస్తుతానికి మొదటి 17 మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను రిలీజ్ చేశారు. ప్రతి జట్టు కనీసం నాలుగు మ్యాచ్లు ఆడతాయి. అయితే, ఢిల్లీ, బెంగళూరు మాత్రం ఐదేసి మ్యాచ్లు ఆడనున్నాయి. ప్రతి టీమ్ తమ సొంత గడ్డ మీద రెండు మ్యాచ్లు ఆడుతుంది. మరో రెండు మ్యాచ్లు వేరే ప్లేస్లో ఆడుతుంది. ఢిల్లీ జట్టు మూడుమ్యాచ్లు సొంతగడ్డ మీద ఆడనుంది. బెంగళూరు టీమ్ మాత్రం మూడు మ్యాచ్లు వేరే చోట ఆడుతుంది.
లోక్సభ ఎన్నికలను బట్టి షెడ్యూల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చు. లోక్సభ ఎన్నికల తేదీలను బట్టి మ్యాచ్లు ముందుకు జరపడం లేదా వేరే తేదీకి మార్చే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల్లో స్థానిక యంత్రాంగం ఎప్పుడు అందుబాటులో ఉంటుందో చూసుకుని అప్పుడు మ్యాచ్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ ఈసారి విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరిగింది. దక్షిణాఫ్రికా లేదా యూఏఈలో నిర్వహిస్తారని భావించారు. అయితే, ఇప్పటి వరకు విడుదలైన షెడ్యూల్లో మ్యాచ్లు అన్నీ భారత్లోనే నిర్వహిస్తున్నారు. 2009లో ఐపీఎల్ టోర్నీ మొత్తం సౌతాఫ్రికాలో నిర్వహించారు. 2014లో కొన్ని మ్యాచ్లు యూఏఈలో జరిగాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు..
* మార్చి 24న కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ (కోల్కతా)
* మార్చి 29న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్)
* మార్చి 31న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (హైదరాబాద్)
* ఏప్రిల్ 4న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (ఢిల్లీ)
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more