ఇంగ్లాండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్ ఇటీవలే తన రిటైర్ మెంట్ ప్రకటించాడు. దీంతో తన చివరి టెస్టును అడుతున్న ఆయన తన ఆల్ టైమ్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. తన 11 మంది సభ్యుల జాబితాలో కనీసం ఒక్క భారతీయ క్రీడాకారుడికి కూడా చోటు కల్పించకుండా చూసుకున్నాడు. యావత్ క్రికెట్ ప్రపంచం దేవుడిగా అభివర్ణించే లిటిల్ మాస్టార్ సచిన్ టెండుల్కర్ కు కానీ ది వాల్ రాహుల్ ద్రావిడ్ కు కానీ స్థానం కల్పించలేదు.
తన డ్రీమ్ జట్టుకు తన మార్గనిర్దేశకుడు, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు గ్రాహమ్ గూచ్ ను సారధిగా ఎంపిక చేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. ‘గూచ్ నా కెప్టెన్, ఓపెనర్గా ఉంటాడు. అతడికి తోడుగా మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా) ఓపెనింగ్ దిగుతాడు. వీరిద్దరూ బంతి మెరుపును పోగొట్టి నా కోసం కొన్ని బంతుల్ని స్టాండ్స్లోకి పంపిస్తారు. మిడిలార్డర్లో బ్రయన్ లారా (విండీస్), రికీ పాంటింగ్ (ఆసీస్), డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)ను ఎంచుకుంటాను.
వారికిష్టమైన ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగుతారు. బౌలర్ల విషయానికి వస్తే ముత్తయ్య మురళీ ధరన్ (శ్రీలంక), షేన్ వార్న్ (ఆసీస్) స్పిన్నర్లు. జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్), గ్లెన్ మెక్గ్రాత్ (ఆసీస్) పేస్ బౌలర్లు’ అని కుక్ తెలిపాడు. ఇంగ్లాండ్ తరఫున సుదీర్ఘ క్రికెట్ ఆడిన అలిస్టర్ కుక్ భారత్ తో జరిగే చివరి టెస్టు తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతున్నాడు. 160 టెస్టుల్లో 44.88 సగటుతో అతడు 12,254 పరుగులు సాధించి ఇంగ్లాండ్లో అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more